Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత "ఐ లవ్ యూ" పోస్ట్.. ఎవరి కోసం తెలుసా?

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (17:25 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం యశోద సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. సమంత అనారోగ్యం బారిన పడి ప్రస్తుతం కోలుకుంది. ఈ విషయం తెలియడంతో చాలామంది సెలబ్రిటీలు, అభిమానులు సమంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు పోస్టు చేశారు. 
 
ఈ పరిస్థితుల్లో సమంత తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఆ పోస్టు క్షణాల్లో వైరల్ అయింది. ఈ పోస్టులో ఐ లవ్ యూ అని సమంత పోస్టు చేసింది. దీంతో ఈ పోస్టు ఎవరి కోసమంటూ ప్రచారం సాగింది. కానీ ఇందులో పెద్దగా అపార్థం చేసుకునే అవసరం లేదని సినీ పండితులు చెప్తున్నారు. 
 
ఎందుకంటే సమంత తాజాగా నటించిన సినిమా యశోద ఈనెల 11వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్న నేపథ్యంలో సుదర్శన్ థియేటర్ వద్ద సమంతకి భారీ కటౌట్స్ ఏర్పాటు చేశారు ఆమె ఫ్యాన్స్. 
 
ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ వీడియోను సమంత కూడా వీక్షించింది. దీంతో ఆమె సంతోషానికి అవధుల్లేవ్. అందుకే తన ఫ్యాన్స్ కోసం సమంత ఆనందం పట్టలేక ఐ లవ్ యు అంటూ తన ఫీలింగ్స్‌ని పోస్ట్ రూపంలో బయటపెట్టింది.

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments