Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత సెట్లోనే కన్నీళ్లు పెట్టుకుంది.. ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 14 నవంబరు 2018 (11:15 IST)
టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత ట్రస్టును నడుపుతున్న సంగతి తెలిసిందే. సినిమాల్లో నటిస్తూ వచ్చిన పారితోషికంతో 'ప్రత్యూష సపోర్ట్' అన్న స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి, ప్రాణాపాయంలో ఉన్న చిన్నారులకు తోచినంత సాయం చేస్తూ, వారికి చికిత్సలను అందించేందుకు సహకరిస్తోంది. 
 
అయితే ఇటీవల సనా అనే పసికందు కాలేయం చెడిపోతే.. తన మిత్రబృందంతో కలిసి రూ.15లక్షలు సేకరించిన సమంత.. ఆ బిడ్డకు చికిత్స చేయించింది. ఆ డబ్బుతో వైద్యులు సనాకు కాలేయాన్ని మార్చినా ఫలితం లేకపోయింది. చికిత్స ఫలించక సనా ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న సమంత.. ఓ సినిమా షూటింగ్ సెట్లోనే కన్నీళ్లు పెట్టుకుంది. 
 
ఈ విషయాన్ని ''ప్రత్యూష సపోర్ట్''లో వాలంటీర్‌గా ఉన్న శశాంతా బినేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సనా చనిపోయిన రోజే సమంత పుట్టిన రోజని ఆమె భావోద్వేగానికి లోనయ్యారని చెప్పారు. ఇప్పటివరకూ తాము 547 మంది చిన్నారులను కాపాడామని, సనా ప్రాణాలు కోల్పోవడం మాత్రం దురదృష్టకరమని తెలిపారు. బినేష్ పోస్టుపై సమంత స్పందిస్తూ, శశాంక పోస్టును రీపోస్ట్ చేసింది.

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments