Webdunia - Bharat's app for daily news and videos

Install App

భరణంగా రూ.200 కోట్లు.. నయాపైసా కూడా తీసుకోని సమంత?!

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (12:26 IST)
టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. అయితే విడాకుల సమయంలో సమంతకు భారీగా భరణం ఇచ్చారనే విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. విడాకులు ఇచ్చినందుకు నాగచైతన్య ఫ్యామిలీ.. సమంతకు ఏకంగా 200 కోట్ల భరణాన్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యారనే వార్తలు గుప్పుమన్నాయి. 
 
అయితే ఈ భరణాన్ని సమంత తిరస్కరించిందనే వార్త మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై అటు సమంత కానీ.. ఇటు అక్కినేని ఫ్యామిలీ కానీ పెదవి విప్పలేదు. అక్కినేని ఫ్యామిలీ ఇచ్చే భరణంలో నయాపైసా సమంత తీసుకోకూడదని నిర్ణయించుకుందని.. ఇప్పటికే దక్షిణాదిలో అగ్రహీరోలు, టాప్ బ్యానర్లతో పనిచేసి సంపాదిస్తోందని.. ఈ భరణాన్ని తిరస్కరించిందని సమాచారం. విడాకులు తీసుకున్నా కానీ..వారి డబ్బు తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్టు ప్రచారం సాగుతోంది.
 
ఇక విడాకుల తర్వాత బయట కనిపించకూడదని సమంత డిసైడ్ అయ్యారట.. ఈ సంఘటనతో సమంత హృదయం ముక్కలైందని.. ఇప్పట్లో ఎలాంటి ప్రాజెక్టులు ఒప్పుకోవద్దనే ఆలోచనల్లో ఉందని సమాచారం. కొద్దిరోజులు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. 
 
కొద్దిరోజులు ఆమెకు మానసిక విశ్రాంతి అవసరం.. ఆ తర్వాతే సినిమాలపై తదుపరి నిర్ణయం తీసుకొంటారని సమంత సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం సమంత తెలుగులో 'శాకుంతలం' అనే సినిమాలో నటించింది. తమిళంలో 'కాథువాకుల'లో నటిస్తోంది. ఈ చిత్రాలు త్వరలోనే విడుదల కానున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్న విషయాలకే భర్త వేధింపులు.. చీరతో ఉరేసుకుని భార్య ఆత్మహత్య

వరుసబెట్టి మావో అగ్రనేతలను లేపేస్తున్న 'ఆపరేషన్ కగారు'

వృద్ధుడుని కొమ్ములతో పైకెత్తి.. నేలకేసి కొట్టి.. కాళ్లతో తొక్కేసిన ఎద్దు (Video)

పొట్టి దస్తులు ధరించే మహిళలు రాక్షసి శూర్పణఖలు : బీజేపీ మంత్రి కైలాస్ విజయ్

Trump To Visit China?: చైనాలో పర్యటించనున్న డొనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments