Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైరాబాద్ పెద్దమ్మతల్లి ఆలయంలో సమంత పూజలు

Webdunia
బుధవారం, 15 మార్చి 2023 (13:13 IST)
హైదరాబాద్ నగరం, జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని హీరోయిన్ సమంత సందర్శించారు. ఆమె బుధవారం ఉదయాన్నే "శాకుంతలం" సినిమా యూనిట్ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఈ చిత్రం వచ్చే నెల 14వ తేదీన విడుదలకానుంది. ఈ నేపథ్యంలో పెద్దమ్మ తల్లిని ఆ సినిమా యూనిట్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసింది. ఇందులో సమంతతో పాటు ఆ చిత్ర దర్శకుడు గుణశేఖర్, నిర్మాత నీలమ, దేవ్ మోహన్‌లు కూడా ఉన్నారు. ఈ చిత్రంలో మలయాళీ హీరో దేవ్ మోహన్ ఓ కీలక పాత్రను పోషించిన విషయం తెల్సిందే. 
 
అదేవిధంగా ప్రకాష్ రాజ్, అదితి బాలన్, మోహన్ బాబు, మధుబాల, అనన్య నాగళ్ల, గౌతమి తదితరులు ఇతర పాత్రలను పోషించారు. పైగా, ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ బాల నటిగా వెండితెరకు పరిచయమవుతుంది. శకుంతల, దుష్యంతనుల ప్రేమకథ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానుంది. ఈ క్రమంలో శాకుంతలం సినిమా యూనిట్ ప్రమోషన్ ప్రారంభించింది. కాగా, ఇప్పిటికే విడుదలైన ఈ చిత్రం పాటలు, ట్రైలర్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments