Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయ్యాక నాలో చాదస్తం మరింత ఎక్కువైంది.. 'యూ టర్న్‌' సమంత

అక్కినేని నాగచైతన్యను అక్టోబర్‌లో పెళ్లాడిన అందాల రాశి సమంత ప్రస్తుతం రంగస్థలం సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా వుంది. ఈ నేపథ్యంలో పెళ్లికి తర్వా తన స్వేచ్ఛను కోల్పోవాల్సిన అవసరం తనకు రాలేదని చెప్పుకొచ్చ

Webdunia
బుధవారం, 13 డిశెంబరు 2017 (12:35 IST)
అక్కినేని నాగచైతన్యను అక్టోబర్‌లో పెళ్లాడిన అందాల రాశి సమంత ప్రస్తుతం రంగస్థలం సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా వుంది. ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత తన స్వేచ్ఛను కోల్పోవాల్సిన అవసరం తనకు రాలేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. పెళ్లాడిన తర్వాత చాదస్తం బాగా పెరిగిపోయిందని వెల్లడించింది.
 
పెళ్లాడాక కొత్తగా తనలో ఎలాంటి మార్పులు రాకపోయినా.. మొదటి నుంచి తనలో వున్న చాదస్తం మరింతగా  పెరిగిందని చెప్పుకొచ్చింది. ఏదైనా కథ వింటే తప్పులు వెదికే వైఖరి పెరిగిపోయిందని అంది. పెళ్లి కాకముందు కాస్త నచ్చని కథలు తన ముందుకు వచ్చినప్పుడు, వాటి గురించి మరింత లోతుగా విశ్లేషణ చేస్తున్నానని సమంత తెలిపింది. మంచి సినిమాలు చేతిలో ఉండటం వల్లే నచ్చని కథలను అలా వదిలేస్తున్నానని తెలిపింది. 
 
ఇదిలావుంటే సమంత నిర్మాతగా మారనున్నారు. గతంలో అనుకున్నట్టుగానే కన్నడలో సూపర్ హిట్ అయిన చిత్రం 'యు టర్న్'తోనే నిర్మాతగా మారేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈసారి నిర్మాణం విషయంలో మామయ్య నాగ్ సలహాలు కూడా ఆమె తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
కన్నడలో లూసియా చిత్రం ఫేం పవన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పెద్ద స్టార్స్ ఎవరూ నటించలేదు. అయినా మౌత్ టాక్‌తో మంచి వసూళ్లను సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో సమంత నిర్మాతగా బాధ్యతలు చేపడుతూనే.. నటించనుందని టాక్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి కొత్త పరువు - దిండ్లు - ప్రొటీన్ పౌడర్ - కిన్లే వాటర్ - దోమతెర కావాలి...

మేనల్లుడుతో ప్రేమ - భర్త - నలుగురు పిల్లలు వదిలేసి పారిపోయిన వివాహిత!!

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments