Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణజింకల కేసు- సల్మాన్ నిర్దోషి.. రామ్ గోపాల్ వర్మ ఏమన్నారో తెలుసా?

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు కృష్ణజింకలను వేటాడిన కేసుల్లో ఊరట లభించడంపై సోషల్ మీడియాలో ఇప్పటికే పలు విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. సల్మాన్ ఖాన్‌కు కృష్ణ జింకల కేసులో నిర్దోషిత్వం ఇవ్వ

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (16:25 IST)
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు కృష్ణజింకలను వేటాడిన కేసుల్లో ఊరట లభించడంపై సోషల్ మీడియాలో ఇప్పటికే పలు విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. సల్మాన్ ఖాన్‌కు కృష్ణ జింకల కేసులో నిర్దోషిత్వం ఇవ్వడంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు.

ఈ వ్యవహారంపై రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. ''కేవలం సెలబ్రిటీ కేసుల్లోనే మన న్యాయవ్యవస్థ ఎంత నెమ్మదిగా పనిచేస్తుందో తెలుస్తోంది. సల్మాన్ నిర్దోషి అని చెప్పడానికి న్యాయవ్యవస్థకు ఇరవై సంవత్సరాలు పట్టిందంటూ" వర్మ ట్వీట్ చేశారు.
 
కాగా, 1998లో జోథ్ పూర్‌లో రెండు వేర్వేరు ఘటనల్లో రక్షిత వన్యప్రాణులైన ఓ కృష్ణజింకను, ఓ మామూలు జింకను వేటాడి చంపినట్టు సల్మాన్‌తో పాటు మరో ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో జోథ్ పూర్ కోర్టు సల్మాన్‌కు ఐదేళ్ల జైలుశిక్ష విధించగా.. ఈ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది.

ఈ కేసులో వాదనలు గత మే నెలలో ముగిశాయి. దీంతో తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు సోమవారం తుది ఉత్తర్వులను జారీ చేస్తూ సల్మాన్ నిర్దోషిగా ప్రకటించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్-ఇజ్రాయేల్ దాడులు.. ఎయిరిండియా కీలక నిర్ణయం.. ఏంటది?

MP: పన్నా జిల్లాలో గనిని తవ్వుతుండగా 2.69 క్యారెట్ల వజ్రం

25న మధ్యాహ్నం 12.01 గంటలకు శుభాంశు శుక్లా రోదసీయాత్ర

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం : ఏపీలో విస్తారంగా వర్షాలు

హమ్మయ్య... ఢిల్లీకి చేరుకున్న ఏపీ విద్యార్థులు.. ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments