Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలీవుడ్ హీరోల సరసన సాయిపల్లవి.. శర్వానంద్‌‌తో ఫిదా హీరోయిన్..

కోలీవుడ్‌లో సూర్య, ధనుష్ సరసన నటిస్తున్న సాయిపల్లవి.. తెలుగులో శర్వానంద్‌తో కొత్త సినిమాలో నటించేందుకు సంతకాలు చేసింది. మారుతి దర్శకత్వంలో 'మహానుభావుడు' చేసి హిట్ కొట్టిన శర్వానంద్, తన తదుపరి సినిమాను

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2017 (11:50 IST)
కోలీవుడ్‌లో సూర్య, ధనుష్ సరసన నటిస్తున్న సాయిపల్లవి.. తెలుగులో శర్వానంద్‌తో కొత్త సినిమాలో నటించేందుకు సంతకాలు చేసింది. మారుతి దర్శకత్వంలో 'మహానుభావుడు' చేసి హిట్ కొట్టిన శర్వానంద్, తన తదుపరి సినిమాను హను రాఘవపూడితో చేయనున్నాడు. ఈ చిత్రంలో శర్వానంద్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఇందులోని సెకండాఫ్‌లో వచ్చే యాక్షన్ సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని సినీ యూనిట్ అంటోంది. 
 
ఇలాంటి ఫైట్స్, శర్వానంద్ సినిమాల్లో ఎక్కడా కనిపించవని.. తొలిసారి శర్వానంద్ భారీ ఫైట్స్ చేస్తున్నారని టాక్ వస్తోంది. ఈ సినిమాలో శర్వా జోడీగా సాయిపల్లవి నటించనుంది. ఈ ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా పండుతాయని సమాచారం.
 
ఈ సినిమా షెడ్యూల్ నేపాల్‌లో జరుపనున్నట్లు సినీ యూనిట్ తెలిపింది. ఒక వైపున 'నా పేరు సూర్య' సినిమాలో అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్‌గా చేస్తుంటే, మరో వైపున శర్వానంద్ కూడా అదే విధమైన పాత్రలో కనిపించనున్నాడు. అల్లు అర్జున్ మాదిరిగానే మరింత ఫిట్ నెస్ ను సాధించడానికి గట్టిగానే కసరత్తు చేస్తున్నాడు. 
 

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments