Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పృహలోకి వచ్చిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (18:58 IST)
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ స్పృహలోకి వచ్చారు. గత శుక్రవారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన తేజ్ ఆరోగ్య పరిస్థితి వివరాలను అపోలో హాస్పటల్ బులిటిన్ విడుదల చేసారు. బులిటిన్ ప్రకారం.. తేజు స్పృహలోకి వచ్చారని.. వెంటిలేటర్‌ను తొలగించినట్లు అపోలో వైద్యులు ప్రకటించారు.

తేజ్ ఆరోగ్యం నిలకడగా ఖంగారు పడాల్సిన అవసరం లేదని, మరికొన్ని రోజుల పాటు తేజ్ హాస్పిటల్‌లోనే ఉండి చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. శరీరంలోని ముఖ్య భాగాలన్నీ బాగానే పనిచేస్తున్నట్లు.. తనంతట తానే శ్వాస తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.
 
గత వారం మాదాపూర్‏లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్‌పై నుంచి ఐకియా వైపుగా గచ్చిబౌలి వెళుతోన్న సమయంలో తేజ్‌ ప్రయాణిస్తోన్న స్పోర్ట్స్‌ బైక్‌ స్కిడ్‌ అవ్వడంతో ఒక్కసారిగా కింద పడిపోయారు.

దీంతో వెంటనే ఆయనను సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత ఆయనను జూబ్లీ హిల్స్‏లోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం తేజు అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. షోల్డర్‌ బోన్‌ సర్జరీ చేసిన వైద్యులు ఆయనను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments