Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి గారూ పదేళ్లు మిస్ చేసుకున్నాం.. కుమ్మేశారంతే.. ఖైదీలో ఆ రెండు పొలిటకల్ డైలాగ్స్ అదుర్స్..

ప్రముఖ దర్శకుడు, బాహుబలి జక్కన్న 'ఖైదీ నంబర్‌ 150' చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురింపిచారు. పదేళ్ల పాటు మెగాస్టార్ చిరంజీవిని మిస్ అయ్యామంటూ ట్వీట్ చేసారు. 'బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ చిరంజీవిగారు తిరిగి వచ్చ

Webdunia
బుధవారం, 11 జనవరి 2017 (16:42 IST)
ప్రముఖ దర్శకుడు, బాహుబలి జక్కన్న 'ఖైదీ నంబర్‌ 150' చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురింపిచారు. పదేళ్ల పాటు మెగాస్టార్ చిరంజీవిని మిస్ అయ్యామంటూ ట్వీట్ చేసారు. 'బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ చిరంజీవిగారు తిరిగి వచ్చినందుకు ధన్యవాదాలని తెలిపారు. పదేళ్ల మిమ్మల్ని మిస్ చేసుకున్నామన్నారు. 
 
రికార్డు బ్రేకింగ్‌తో నిర్మాతగా తెరంగేట్రం చేసిన చరణ్‌కు శుభాకాంక్షలు. వినయ్‌గారు.. కుమ్మేశారంతే.. మీకన్నా బాగా ఈ ప్రాజెక్టును ఇంకెవరూ తీయలేరు. టీమ్‌ కేఎన్‌150.. ఇది పెద్ద విజయం' అని రాజమౌళి ట్వీట్‌ చేశారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో కాజల్‌ కథానాయికగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు.
 
ఇకపోతే.. ఖైదీ కోసం.. ఒరిజినల్ 'కత్తి' నుంచి కొన్ని డిలీషన్స్ తప్పలేదని చిరంజీవి ముందే చెప్పారు. రాజకీయాలను టచ్ చేస్తూ వున్న కొన్ని డైలాగుల జోలికి తాను వెళ్లనేలేదని రిలీజుకు ముందు స్టేట్ మెంట్ ఇచ్చారు. అయితే ఖైదీ మూవీలో 'పొలిటికల్ పంచ్' మిస్సవుతుందని భావించిన ఫ్యాన్స్‌కు పొలిటకల్ డైలాగ్స్ కూడా వినిపించాయి. 
 
చిరు పొలిటికల్ నేచర్‌ని గుర్తు చేస్తూ రెండు చోట్ల రెండు 'కత్తి' లాంటి డైలాగులు వినిపించాయి. 'అభిమానాన్ని అమ్ముకునేంత అవినీతి నాకు తెలీదు సర్‌', 'నవ్విన వాళ్లకి చెప్పు... ఏడ్చే రోజు త్వరలోనే వస్తుందని' చిరంజీవి నోటి నుంచి ఈ మాటలు వినిపించగానే అభిమానుల కేరింతలతో థియేటర్ దద్దరిల్లింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Lahore: లాహోర్‌లో శక్తివంతమైన పేలుళ్లు- భద్రత కట్టుదిట్టం

Balochistan: బలూచిస్తాన్‌లో 14మంది పాకిస్థాన్ సైనికులు మృతి.. బాధ్యత వహించిన బీఎల్ఏ (video)

Malala Yousafzai: భారతదేశం-పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలి.. మలాలా యూసఫ్ జాయ్

Operation Sindoor impact: పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది.. ఈ యుద్ధాన్ని చివరి వరకు తీసుకెళ్తాం

Rahul Gandhi: రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం సవాలు- పిటిషన్ కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments