సుశాంత్ హత్య కేసు : రియా చక్రవర్తిపై చార్జిషీటు దాఖలు

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (07:56 IST)
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించిన కేసులో బాలీవుడ్ నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిపై ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు చార్జిషీటును దాఖలు చేశారు. 
 
ఈ కేసులో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు డ్రగ్స్ తీసుకున్నందుకు అలాగే దివంగత స్టార్ రాజ్‌పుత్ తరపున వాటిని పొంది చెల్లించినందుకు అభియోగాలు నమోదు చేయాలని ప్రాసిక్యూషన్ కోర్టును కోరినట్లు సమాచారం. డ్రగ్స్ సరఫరా చేసిన కేసులో రియా, ఆమె సోదరుడు నిందితులుగా ఉన్న విషయం తెల్సిందే. 
 
ఈ కేసు దర్యాప్తులో భాగంగా, రియా చక్రవర్తి సెప్టెంబర్ 2020లను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రియాను పోలీసులు అరెస్టు చేయగా, దాదాపు నెల తర్వాత జైలు జీవితం తర్వాత బాంబే హైకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. డ్రగ్స్ కేసులో ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు మరికొంత మంది వ్యక్తులపై కూడా డ్రగ్స్ ఫైనాన్సింగ్ ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం వీరిలో చాలామంది బెయిల్‌పై స్వేచ్ఛగా ఉన్నారు. కాగా, గత 2020 జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతదేహం ముంబైలోని బాంద్రాలోని అతని అపార్ట్‌మెంట్‌లో గుర్తించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడుతున్న ఉపరితల ఆవర్తనం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : భారాస డమ్మీ అభ్యర్థిగా విష్ణువర్థన్ రెడ్డి

దీపావళి వేడుకలకు దూరంగా ఉండండి : పార్టీ నేతలకు హీరో విజయ్ పిలుపు

వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ చేసిన కౌన్సిలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments