Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్‌కు విస్కీ ఛాలెంజ్ విసిరిన దర్శకుడు ఎవరు?

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (16:08 IST)
కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరూ తమతమ గృహాలకే పరిమితమయ్యారు. ఇలాంటి వారిలో పలువురు సెలెబ్రిటీలు తమ ఇళ్లలో పను చేస్తూ, అలాంటి పనులనే చేయాలంటూ మరికొంతమంది సెలెబ్రిటీలను నామినేట్ చేస్తూ ప్రోత్సహిస్తున్నారు. 
 
తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన దర్శకుడు సందీప్ వంగా బీ ద రియల్ మ్యాన్ పేరుతో విసిరిన ఓ ఛాలెంజ్ ఇపుడు టాలీవుడ్‌లో వైరల్ అయింది. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన దర్శకుడు రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తమ టాస్క్‌లను విజయవంతంగా పూర్తి చేశారు. 
 
ముఖ్యంగా రాజమౌళి తన పనులను పూర్తి చేసి, జూనియర్ ఎన్టీఆర్, చెర్రీల పేర్లను నామినేట్ చేశారు. ఇపుడు ఈ ఇద్దరు హీరోలు మరికొందమంది పేర్లను నామినేట్ చేశారు. ఈ క్రమంలో తెలుగులో వివాదాస్పద దర్శకుడుగా పేరొందిన రాంగోపాల్ వర్మ ఇపుడు ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విస్కీ ఛాలెంజ్ విసిరారు. 
 
ఇప్పుడు అంద‌రూ మందు దొర‌క్క ఇబ్బందిప‌డుతున్నారని, ఇలాంటి స‌మ‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ టీవీలో అంద‌రికీ క‌నిపించేలా గ్లాస్ విస్కీ తాగి అందరికీ షాక్ ఇవ్వాల‌నేదే త‌న ఛాలెంజ్ అని ఆర్జీవీ తెలిపారు.
 
అయితే, ఆర్జీవీ ఈ తరహా ఛాలెంజ్ విసరడానికి గల కారణాన్ని కూడా వివరించారు. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ అయివున్నాయి. ఇపుడు విస్కీ ఛాలెంజ్ విసరడం ద్వారా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ టీవీలో అంద‌రికీ క‌నిపించేలా గ్లాస్ విస్కీ తాగి అందరికీ షాక్ ఇవ్వాల‌నేదే త‌న ఛాలెంజ్ అని ఆర్జీవీ తెలిపారు.

సంబంధిత వార్తలు

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments