నేనే నా..`లో వందేళ్ళ నాటి రాణిగా ప్ర‌స్తుత శాస్త్రవేత్తగా రెజీనా

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (13:25 IST)
Regina Cassandra
ప్ర‌తి సినిమాకి త‌న న‌ట‌న‌లోని నైపుణ్యాన్ని నిరంతరం నిరూపించుకుంటోంది హీరోయిన్ రెజీనా క‌సాండ్ర‌. ప్ర‌స్తుతం ఆమె రాణిగా, పురావస్తు శాస్త్రవేత్తగా ద్విపాత్రాభినయం చేస్తోన్న చిత్రం `నేనే నా..?. ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్‌తోనే ఆడియ‌న్స్ లో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.
 
రెజీనా కసాండ్రా పాన్-ఇండియన్ డొమైన్ అంతటా పాపులర్ అయినందున ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే `నిను వీడ‌ని నీడ‌ను నేనే` వంటి హిట్ త‌ర్వాత కార్తీక్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మొద‌టి సినిమా `జాంబీరెడ్డి`తో సూపర్ హిట్ సాధించిన రాజ్ శేఖర్ వర్మ త‌న ఆపిల్ ట్రీ స్టూడియోస్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.2గా రూపొందిస్తున్న వెంచర్ కావ‌డంతో ఈ సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. వాటికి తగ్గ‌ట్టుగా ఈ మూవీ ట్రైల‌ర్‌ను నిధి అగర్వాల్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, డైరెక్టర్ లింగుసామి ఆవిష్కరించారు.
 
ట్రైలర్ చూస్తుంటే 100 సంవత్సరాల క్రితం జరిగిన ఒక భయంకరమైన సంఘటన ఇప్పుడు పునరావృతమవుతోంది అని తెలుస్తోంది. రెజీనా 100 సంవత్సరాల క్రితం ఆమె రాణి  అయితే ఆమె ప్ర‌స్తుతం పురావస్తు శాస్త్రవేత్తగా ఒక రహస్యమైన కేసును పరిష్కరించడానికి వచ్చిన‌ట్టు తెలుస్తోంది.
 
అలాగే ఈ ట్రైల‌ర్లో అడవిలో ఏకాంత ప్రదేశంలోకి ప్రవేశించే వ్యక్తులతో పాటు, రహస్యమైన కేసును పరిష్కరించడానికి కేటాయించిన వారు కూడా చంపబడుతున్నారు. గత, ప్రస్తుత కథల మధ్య లింక్ సినిమాకు కీలకం కానుంది. హర్రర్ ఎలిమెంట్స్ మరియు కామెడీతో కూడిన మిస్టరీ స‌బ్జెక్ట్ మూవీ  ప్రేక్షకులకు త‌ప్ప‌కుండా సరికొత్త అనుభూతిని అందించ‌నుంది.
 
తెలుగు, తమిళంలో ఏక కాలంలో రూపొందించ‌బ‌డిన ఈ బైలింగ్వ‌ల్ మూవీలోని కీల‌క స‌న్నివేశాల‌ను  కుర్తాళం మరియు చుట్టుపక్కల ప్రాంతాల‌లో చిత్రీకరించారు. సామ్ సిఎస్ సంగీతం సమకూరుస్తుండగా, గోకుల్ బెనాయ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సాబు ఎడిటర్ మరియు సూపర్ సుబ్బరాయన్ స్టంట్ మాస్టర్. వెన్నెల కిషోర్, అక్షరగౌడ, తాగుబోతు రమేష్, జయ ప్రకాష్ స‌హా మరికొంత ప్రముఖ కళాకారులు ఈ మూవీలో న‌టిస్తున్నారు.
ఈ మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జ‌రుగుతోంది.
తారాగణం: రెజీనా కసాండ్రా, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, జయ ప్రకాష్, అక్షర గౌడ 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vizag: కైలాసగిరి కొండలపై కాంటిలివర్ గాజు వంతెన ప్రారంభం

ఐదేళ్ల చిన్నారిపై పాశవికంగా దాడి చేసిన ఆయా

మహిళా వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి, దుస్తులు విప్పించి లైంగిక వేధింపులు..

భర్తను హత్య చేసిన భార్య.. గొడవలే గొడవలు.. ఇంట్లోకి రానివ్వకపోవడంతో..?

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ యువకుడిని చంపేశారు... అయినా శవాన్నే పెళ్లి చేసుకున్న యువతి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments