1650 ఎకరాల అటవీ భూమి దత్తత తీసుకున్న ప్రభాస్, అభివృద్ధికి రూ. 2 కోట్లు

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (19:43 IST)
ఖాజిపల్లి అర్బన్ ఫారెస్ట్ పార్క్‌కు ఈరోజు శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ప్రభాస్ తదితరులు పాల్గొన్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 1650 ఎకరాల అటవీ భూమి దత్తత తీసుకున్నారు. ఎంపీ సంతోష్ కుమార్ చొరవతో దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు బాహుబలి.
 
ఔటర్ రింగ్ రోడ్డు వెంట అందుబాటులోకి రానున్న మరో అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఇది. తండ్రి దివంగత U.V.S రాజు పేరు మీద అర్బన్ పార్కు, అటవీ ప్రాంతం అభివృద్ది చేయనున్నారు ప్రభాస్. ఇందుకోసం రెండు కోట్ల రూపాయలు అందించిన ప్రభాస్, అవసరాన్ని బట్టి మరింత ఖర్చు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసారు.
ఖాజిపల్లిలో అర్బన్ ఫారెస్ట్ పార్కుకు శంఖుస్థాపన చేసి... మొక్కలు నాటారు సంతోష్, ప్రభాస్. వ్యూ పాయింట్ నుంచి అటవీ అందాలు పరిశీలించారు. త్వరలో మరిన్ని అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌ల దత్తతకు ప్రయత్నిస్తామని ఎం.పీ సంతోష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పీసీసీఎఫ్ శోభ, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దపిల్లి అనుకుని పెద్దపులికి బీర్ తాపించబోయాడు.. ఇది రియల్ వీడియోనా లేదా ఏఐ వీడియోనా?

ఈ తాగుబోతుని చంపి తినడం కంటే వేరే దరిద్రం లేదని వెళ్లిపోయిన పులి (video)

Bullet Train To Amaravati: అమరావతికి బుల్లెట్ రైలు.. రూ.33వేల కోట్ల ఖర్చు

మొంథా ఎఫెక్ట్: భారీ వర్షాలు అవుసలికుంట వాగు దాటిన కారు.. కారులో వున్న వారికి ఏమైంది? (video)

మొంథా తుఫాను ఎఫెక్ట్ : తెలంగాణలో 16 జిల్లాలు వరద ముప్పు హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments