Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజ-దిల్ రాజు 'ఎవడో ఒకడు' చిత్రానికి బ్రేక్ పడింది ఎందుకని...?

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2016 (17:06 IST)
రవితేజ కిక్‌ 2 తర్వాత 'ఎవడో ఒకడు' అనే చిత్రం చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు దిల్‌ రాజు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. దిల్‌ రాజు కూడా.. సాంప్రదాయ దుస్తులు ధరించి.. హోమం కూడా చేశాడు. అయితే ఆ చిత్రం అనుకున్న సమయానికి సెట్‌పైకి వెళ్ళలేకపోయింది. ఇందుకు రకరకాల కారణాలున్నాయి. ముఖ్యంగా రవితేజ రెమ్యునరేషన్‌ విషయంలో ఏకాభిప్రాయం రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. 
 
దిల్‌రాజు.. రవితేజ అడిగినంత ఇవ్వడం లేదని విన్పిస్తోంది. తనకు పెద్దగా హిట్లు లేవని.. ఆయన తగ్గించినట్లు సమాచారం. ఇందుకు రవితేజ పట్టుపట్టడం.. ఓ కారణంగా తెలుస్తోంది. కొత్త దర్శకుడు వేణు శ్రీరాం ఈ చిత్రానికి దర్శకుడు. రవితేజకు ఎప్పుడో ఆయన కథ చెప్పాడు. 
 
ఇప్పుడు ఈ చిత్రం గ్యాప్‌ రావడంతో.. దర్శకుడిగా వేణుకు బ్రేక్‌ పడుతుందేమోనని సన్నిహితులు భావిస్తున్నారు. ఇప్పటికే ఇందులో ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేశారు. వీరికి ఇతర చిత్రాల ప్రభావం కూడా పడనుంది. డేట్స్‌ అనవసరంగా వేస్టు అవుతాయని భయపడుతున్నారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments