Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినీతితో ఒక్క మెడల్ కొట్టేస్తా: లంచగొడి ఎస్ఐ పాత్రలో రాశిఖన్నా

తమిళ చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక స్థాయిని సృష్టించుకున్న తమిళ హీరో విశాల్ ఏకంగా మలయాళ సినిమాలోనే ప్రతినాయకుడిగా అడుగుపెడుతుండగా నాకేం తక్కువ అంటూ అందాల తార రాశిఖన్నా కూడా అదే సినిమాలో విలన్ పాత్రలోకి దిగిపోయిందని సమాచారం.

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2017 (05:53 IST)
జగపతి బాబు లెజెండ్ సినిమాలో ఏ ముహూర్తంలో విలన్ పాత్రలో నటించి అదరగొట్టాడో కానీ బాలీవుడు, కొలివుడ్, మల్లువుడ్ అనే తేడా లేకుండా విలన్ పాత్రలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది.  రజనీకాంత్ 2.0 సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ పాత్రకు ఒప్పుకుని సంచలనం సాధించగా, ఇప్పుడు కొలివుడ్ కూడా విలనీ పాత్రలకోసం పరుగులెడుతోంది. హీరోలే కాదు. హీరోయిన్‌లు కూడా విలనీలుగా నటించడానికి మహా ఇదిగా ముందుకొచ్చేస్తున్నారు.
 
తమిళ చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక స్థాయిని సృష్టించుకున్న తమిళ హీరో విశాల్ ఏకంగా మలయాళ సినిమాలోనే ప్రతినాయకుడిగా అడుగుపెడుతుండగా నాకేం తక్కువ అంటూ అందాల తార రాశిఖన్నా కూడా అదే సినిమాలో విలన్ పాత్రలోకి దిగిపోయిందని సమాచారం. మోహన్‌లాల్ కథానాయకుడిగా ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో తీయనున్న విలన్ సినిమాలా విశాల్ ప్రతినాయకుడిగా ప్రధాన పాత్రలో నటిస్తుంటే, బొద్దు సుందరి రాశీఖన్నా ఒక అవినీతి పోలీసు అధికారిణిగా కన్పించబోతోంది. 
 
ప్రస్తుతం ఈ సినిమా కేరళలోని ఎర్నాకుళం పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ జరుపుకొంటోంది. భారత్‌లోనే తొలిసారి 8కే రిజల్యూషన్‌ ఫార్మాట్‌లో రూపొందుతోంది. మలయాళంలో భారీ బడ్జెట్‌ చిత్రంగానూ రికార్డు సృష్టిస్తోంది. విశాల్‌, రాశీఖన్నాతో పాటు హన్సిక, శ్రీకాంత్‌, మంజువారియర్‌ లాంటి స్టార్స్‌ నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేశ్‌ ఈ సినిమాను నిర్మించడం మరీ విశేషం.
 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజకీయాల్లోకి రోహిత్ శర్మ!! మహారాష్ట్ర సీఎంతో భేటీ!!

Purnam Kumar Shaw: భారత్‌ జవాన్‌ పూర్ణమ్‌ కుమార్‌ షాను అప్పగించిన పాకిస్థాన్

సుప్రీంకోర్టు 52వ సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్

Pawan Kalyan: చిత్తూరు జిల్లాలో అటవీ భూములను ఆక్రమించారు.. పవన్ సీరియస్

కర్నల్ సోఫియా ఖురేషీ ఉగ్రవాదుల మతానికి చెందినవారా? ఎంపీ మంత్రి కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments