కొరటాల ఆచార్యలో.. రామ్ చరణ్‌కి జోడిగా గీత గోవిందం హీరోయిన్

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (15:33 IST)
మాస్ సినిమాలు తెరకెక్కించడంలో దర్శకుడు కొరటాల శివ దిట్ట. ప్రస్తుతం కొరటాల శివ.. మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇటీవల మోషన్ పోస్టరును విడుదల చేశారు. 
 
ఈ సినిమా మెగాస్టార్ టూ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. 
 
చిరు-చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు . ఇక 'ఆచార్య' షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారభించడానికి సన్నాహకాలు చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా ఎవరు నటిస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. 
 
ముందుగా చరణ్ సరసన తమన్నా పేరు ఆతర్వాత కైరా అద్వానీ పేర్లు వినిపించాయి. ఈ క్రమంలో లేటెస్టుగా లక్కీ బ్యూటీ రష్మిక మందన్న 'ఆచార్య' సినిమాలో చరణ్‌కు జోడీగా కనిపించనుందని మరో వార్త చక్కర్లు కొడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

పదేపదే వేడినీళ్లు అడుగుతున్నాడు.. అతనో పిచ్చోడు.. వరుడిపై వధువు మండిపాటు

ChatGPT: 16 ఏళ్ల బాలుడి ఆత్మహత్యకు బాధ్యత వహించని ఓపెన్ఏఐ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments