Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాయం నుంచి కోలుకుంటున్నాను.. రష్మిక మందన్న పోస్ట్

సెల్వి
మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (14:03 IST)
నటి రష్మిక మందన్న తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం పుష్ప ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. అల్లు అర్జున్‌తో కలిసి భారీ అంచనాల చిత్రం 'పుష్ప 2: ది రూల్'లో నటిస్తోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, రష్మిక తాను చిన్న ప్రమాదంలో చిక్కుకున్నానని, ప్రస్తుతం గాయం నుండి కోలుకుంటున్నానని వెల్లడించింది. రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వ్యక్తిగత ఫోటో, ఆమె కోలుకోవడం గురించి భావోద్వేగ సందేశం రాసింది.
 
"కొంతకాలంగా నేను ఇక్కడికి, బయటికి రావడం లేదు. నేను గత నెల రోజులుగా యాక్టివ్‌గా ఉండకపోవడానికి ఒక చిన్న ప్రమాదం కారణం. నేను ఇప్పుడు కోలుకుంటున్నాను. డాక్టర్లు చెప్పినట్టు ఇంట్లోనే ఉన్నా" అని రష్మిక తెలిపింది.
 
ఇకపోతే.. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఆమె ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'పుష్ప 2: ది రూల్' డిసెంబర్ 6న విడుదల కానుంది. శేఖర్ దర్శకత్వంలో ధనుష్, నాగార్జున నటించిన 'కుబేర' చిత్రంలో కూడా రష్మిక కనిపించనుంది.
 
అలాగే 'ది గర్ల్‌ఫ్రెండ్', 'సికందర్'లో కూడా నటించనుంది. బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్‌తో స్క్రీన్‌ను పంచుకోనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమికుడిని నమ్మింది.. పెళ్లి ప్రతిపాదనలో గొడవ.. అంతే ప్రియుడే హత్య చేశాడు..

ఇజ్రాయేల్‌కు ఇక చుక్కలు చూపిస్తాం.. అమెరికా అడ్డొస్తే అంతే సంగతులు: ఇరాన్

మనుషుల ప్రాణాలు హరిస్తున్న వైఎస్. జగన్ వాహన శ్రేణి!!

Raja murder fallout: రాజా రఘువంశీ హత్య: పర్యాటకుల వివరాలు తప్పనిసరి.. మేఘాలయ

ఎయిరిండియా విమాన ప్రమాదానికి కుడివైపు ఇంజినే కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments