Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఎనర్జీకి బన్నీ ఫర్ఫెక్ట్ మ్యాచ్ : రష్మిక మందన్నా

ఠాగూర్
బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (09:47 IST)
హీరోయిన్ రష్మిక మందన్నా తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. చిత్రపరిశ్రమలోని పలువురు హీరోల గురించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా, హీరో అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ, తనకుండే ఎనర్జీకి తగిన వ్యక్తి అల్లు అర్జున్ అంటూ పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీన ఆమె ప్రధాన పాత్రను పోషించిన ఛావా చిత్రం విడుదలకానుంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో రష్మిక మందన్నా పాల్గొంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, విక్కీ కౌశల్, అల్లు అర్జున్, రణబీర్ కపూర్‌లతో కలిసి పనిచేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇటీవల తాను చేసిన చిత్రాల్లోని హీరోలు అందరూ ఎతో మంచి వ్యక్తులను ప్రశంసించారు. స్నేహభావంతో, ఎదుటివారికి ఇబ్బంది కలగకుండా వ్యవహరిస్తారని తెలిపారు. ముఖ్యంగా, అల్లు అర్జున్‌తో తన ఎనర్జీ ఫర్ఫెక్ట‌గా మ్యాచ్ అవుతుందని, ఆయనతో నటించడం ఎంతో సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు.
 
అలాగే, బాలీవుడ్ నటుడు రణవీర్‌కు తన నాన్సెన్స్ నచ్చదన్నారు. కేవలం పాత్రల గురించి తప్ప ఇతర విషయాలు ఏవీ మాట్లాడుకోమని, అంతా ప్రొఫెషనల్‌గా ఉంటామన్నారు. ఇక విక్కీ విషయానికి స్తే ఆయన అద్భుతమైన వ్యక్తిగా పేర్కొన్నారు. ఇలాంటివారు చాలా అరుదుగా ఉంటారన్నారు. అలాంటి వారితో కలిసి పనిచేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని రష్మిక అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments