Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనుష్, శేఖర్ కమ్ముల సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2023 (15:32 IST)
Rashmika Mandanna
యాక్టర్  ధనుష్ తన 51వ సినిమాను టాలీవుడ్ మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ శేఖర్ కమ్ములతో చేస్తున్నారు. ఇటివలే ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్  వచ్చింది. శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ క్రేజీ ప్రాజెక్ట్ #D51ని తమ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్ )లో అమిగోస్ క్రియేషన్స్  ప్రైవేట్ లిమిటెడ్ కలసి నిర్మిస్తున్నారు.  సోనాలి నారంగ్  ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
 
ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటించనున్నారు. ధనుష్, శేఖర్ కమ్ముల, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పితో రష్మిక మందనకు ఇదే ఫస్ట్ అసోషియేషన్. ఈ సందర్భంగా రష్మిక మందన్న తన ఆనందాన్ని పంచుకుంటూ.. చాలా ఎక్సయిటెడ్ గా వుంది. ఈ ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను’’ అని #D51 ఫోటో ఫ్రేం ని ప్రజంట్ చేశారు.
 
అసాధారణమైన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల, ధనుష్‌ని మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేయడానికి యూనిక్ సబ్జెక్ట్ రాసుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో  ప్రముఖ తారాగణం భాగం కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments