శ్రీ అచ్యుత ఆర్ట్స్ బేనర్పై, రేష్మి గౌతమ్ ప్రధాన పాత్రలో చంద్రశేఖర్ ఆజాద్, నిర్మిస్తున్న టాలీవుడ్ మొట్టమొదటి జోంబీ కామెడీ చిత్రం “తను వచ్చెనంట” నిర్మాణానంతర కార్యక్రమాలు, కంప్యూటర్ గ్రాఫిక్స్ పనులు ద
శ్రీ అచ్యుత ఆర్ట్స్ బేనర్పై, రేష్మి గౌతమ్ ప్రధాన పాత్రలో చంద్రశేఖర్ ఆజాద్, నిర్మిస్తున్న టాలీవుడ్ మొట్టమొదటి జోంబీ కామెడీ చిత్రం “తను వచ్చెనంట” నిర్మాణానంతర కార్యక్రమాలు, కంప్యూటర్ గ్రాఫిక్స్ పనులు దిగ్విజయంగా ముగించుకుని సెన్సార్ పూర్తి చేసుకుంది.. అక్టోబర్ 21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది.
ఈ చిత్ర నిర్మాత చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ, ఇటీవల తమ చత్ర యూనిట్ వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, అమలాపురం, భీమవరం, రావులపాలెం మొదలగు ప్రాంతాలలో చేసిన ప్రమోషన్ కార్యక్రమాలకు యూత్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, తప్పక "తను వచ్చెనట" చిత్రం అదిరిపోయే ఓపెనింగ్స్తో సక్సెస్ సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు.
తమ చిత్ర యూనిట్ 100 శాతం అంకితభావంతో చేసిన కృషికి అక్టోబర్ 21వ తేదీన థియేటర్స్లో ప్రేక్షకులు తీర్పు పాజిటివ్ తీర్పునే ఇవ్వబోతున్నారని, ప్రేక్షకులు తప్పకుండా థ్రిల్ అవుతారని నిర్మాత చెప్పారు.
నిర్మాత మాట్లాడుతూ భీమవరం ప్రమోషన్కి వెళ్ళినప్పుడు మా చిత్రం ట్రైలర్ చూసి ప్రముఖ పారిశ్రామికవేత్త మంతెన రవి రాజు ఈస్ట్, వెస్ట్ జిల్లాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఫాన్సీ రేట్కు తీసేసుకున్నారు. మాకు ఆనందం కలిగింది. అదేవిధంగా వైజాగ్ వెళ్ళినప్పుడు ప్రమోషన్ కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఏపీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సూర్య ఫిలిమ్స్ డి.ఎస్.పి.టి.వర్మ, ఎన్.రాజేష్ వర్మ తీసుకోవటం ఇంకా ఆనందం కలిగింది'' అన్నారు.
కొత్త తరహా కథాంశంతో అవుట్ అండ్ అవుట్ కామెడి ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం రొటీన్ సినిమాలా కాకుండా, కథ, కథనం చాల ఫ్రెష్గా ఉంటుందని, సగటు ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు కలిగివుండి, అటు క్లాసుని, ఇటు మాస్ని కూడా మెప్పిస్తుందని దర్శకుడు వెంకట్ కాచర్ల చెప్పారు.