Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో 'చిట్టిబాబు' జోరు.. "రంగస్థలం" దెబ్బకు "శ్రీమంతుడు" బేజారు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం "రంగస్థలం". హీరోయిన్ సమంత. కె. సకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

Webdunia
సోమవారం, 2 ఏప్రియల్ 2018 (12:44 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం "రంగస్థలం". హీరోయిన్ సమంత. కె. సకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. 
 
ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా కనకవర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా, ఓవర్సీస్‌లో రికార్డు స్థాయి వసూళ్లను సాధించిన తెలుగు చిత్రాల జాబితాలో ఈ చిత్రం చేరిపోయింది. తొలిరోజునే 1.2 మిలియన్ డాలర్ల గ్రాస్‌ను సాధించిన ఈ సినిమా, ఆదివారానికి 2.32 మిలియన్ డాలర్లను రాబట్టింది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా 3 మిలియన్ డాలర్లను రాబట్టడం ఖాయమని అంటున్నారు. 
 
ఓవర్సీస్‌లో 'బాహుబాలి 2', 'బాహుబలి' తర్వాత ఫుల్‌రన్‌లో 'శ్రీమంతుడు' 2.87 మిలియన్ డాలర్లను సాధించి 3వ స్థానంలో నిలిచింది. మరికొన్ని రోజుల్లో ఈ స్థానాన్ని 'రంగస్థలం' కైవసం చేసుకోనుందని చెబుతున్నారు. మున్ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో చిట్టిబాబు బాహుబలి మినహా ఇతర చిత్రాల రికార్డులను తిరగరాసేలా దూకుడు ప్రదర్శిస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments