Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానా మరోసారి రాజకీయ నాయకుడిగా?

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (13:53 IST)
తొలి చిత్రం ‘లీడర్‌’తోనే మెప్పించిన రానా దగ్గుబాటి ఆ తర్వాత నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’తో మరో విజయాన్ని అందుకోవడంతో రాజకీయం నేపథ్యంలో సాగే కథలు ఆయనకి బాగా కలిసొచ్చాయనే టాక్ ఇండస్ట్రీలో నాటుకుపోయింది. 
 
ఈ నేపథ్యంలో ఆయన త్వరలోనే మరో చిత్రంలోనూ రాజకీయ నాయకుడిగా ఖద్దరు దుస్తులు ధరించనున్నారని సమాచారం. ‘నీదీ నాదీ ఒకే కథ’ సినిమాతో పరిచయమైన దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రానికి ‘విరాటపర్వం’ అనే టైటిల్ ఖరారు కానుందట. తొలి చిత్రంతోనే విమర్శకుల మెప్పు పొందిన వేణు, ఎమర్జెన్సీ నేపథ్యంలో బలమైన కథని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. 
 
కాగా, ఇందులో రానాకి జంటగా సాయిపల్లవి జంటగా నటించనున్నారు. ప్రజాస్వామ్యం, మార్క్సిజం, మానవ హక్కులు తదితర విషయాల్ని స్పృశిస్తూ సాగే చిత్రమని సమాచారం. డి.సురేష్‌బాబు నిర్మించనున్న ఈ సినిమా... జులై నెలలో పట్టాలెక్కనుంది. 
 
కాగా ఈ సినిమాకి సంబంధించిన కథ... ఎమర్జెన్సీ నేపథ్యంలో మొదలై, 1992తో ముగుస్తుందని సమాచారం. ప్రముఖ నటి టబు కూడా ఈ చిత్రంలో మానవ హక్కుల కార్యకర్తగా బలమైన పాత్రలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా... త్రిపురనేని సాయిచంద్‌ కూడా ఓ పాత్రలో నటిస్తారు. ముచ్చటగా మూడోసారి రాజకీయ నాయకుడిగా నటించనున్న రానాకి ఈ సినిమా ఎంత మాత్రం విజయాన్ని అందజేస్తుందో వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీకి రానున్న ఎనిమిది ఎయిర్ పోర్టులు.. ఎక్కడెక్కడో తెలుసా?

మందుల విషయంలో గొడవ.. తల్లిని హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

Chandrababu: విదేశాల్లో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఎందుకో తెలుసా?

గల్ఫ్ పనిచేస్తూ రుణాలు తీసుకున్నారు.. కేరళకు 13మంది నర్సులు జంప్.. చివరికి?

కాకినాడలో ప్రేమజంట మృతి.. రైల్వే ట్రాక్ వద్ద ప్రేయసిని ప్రియుడు హత్య చేశాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments