Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడివాడ ప్రజలే గోవాకు వెళ్లారు.. గోవా ప్రజలు గుడివాడకు రాలేదు... వర్మ సెటైర్లు

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (12:43 IST)
సంక్రాంతి పండుగ సందర్భంగా కృష్ణా జిల్లాకు చెందిన ఏపీ మంత్రి కొడాలి నాని తన సొంత నియోజకవర్గమైన గుడివాడ ప్రజలకు గోవా కల్చర్ పరిచయం చేశారు. కోవిడ్ ఆంక్షలు కఠినంగా అమలవుతున్న తరుణంలో ఏపీ మంత్రిగా ఉన్న కొడాలి నాని తన అధికారబలంతో గుడివాడలో గోవా క్యాసినో కల్చర్‌ను దిగుమతి చేశారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ సెటైర్లు వేశారు. గుడివాడ ప్రజలే గోవాకు వెళ్లారని, గోవా ప్రజలు గుడివాడకు రాలేదంటూ పంచ్‌లు విసిరారు. అంతేకాకుండా, గుడివాడలో క్యాసినో నిర్వహించడాన్ని చిన్నచూపు చస్తున్నవారంతా గోవా, లాస్ వెగాస్ వంటి మెగా నగరాలను తక్కువ చేయడమేమిటని ఆయన ట్వీట్ చేశారు. 
 
గుడివాడను ప్యారిస్, లండన్, లాస్ వెగాస్ వంటి నగరాలకు ధీటుగా అభివృద్ధి చేస్తున్న మంత్రి కొడాలి నానిని అభినందిస్తున్నట్టు చెప్పారు. క్యాసినో కారణంగా గోవా ప్రజలు గుడివాడ వచ్చేలా ఆధునకీకరిస్తున్న మంత్రి కొడాలి నాని అందరూ మెచ్చుకోవాలని వర్మ పేర్కొన్నాడు. అంతేకాకుండా, తన ట్వీట్‌లో జై గుడివాడ అంటూ క్యాప్షన్ పెట్టాడు.

 

సంబంధిత వార్తలు

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments