Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేఏపాల్‌పై పరువు నష్టం దావా.. రామ్ గోపాల్ వర్మ ఫైర్

Webdunia
సోమవారం, 16 డిశెంబరు 2019 (14:15 IST)
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి కేఏపాల్‌పై విమర్శలు గుప్పించారు. ప్రపంచ యుద్ధాన్ని ఆపానని చెప్పుకుంటున్న పాల్.. తన సినిమా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలును ఆపలేకపోయారనే ఎద్దేవా చేశారు. తన సినిమా విడుదలకు ఆటంకాలు కలిగించిన ఆరుగురిపై పరువు నష్టం కేసులు పెడతామని తెలిపారు.
 
సినిమా విడుదలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కూడా తన చిత్రంపై కొందరు ఆరోపణలు చేశారని వీరి వెనుక ఎవరున్నారో తనకు తెలుసని తెలిపారు. వీరి వల్ల తన సినిమా విడుదల ఆలస్యమైందని మండిపడ్డారు. తన చిత్రం కులాల మధ్య చిచ్చు పెట్టేలా వందని.. టైటిల్ అభ్యంతరకరంగా వుందంటూ నమోదైన కేసులను కోర్టు కొట్టేసిందని వర్మ చెప్పారు.
 
ఎవరెవరైతే ఆటంకాలు కలిగించారో, డబ్బు తీసుకుని తమను ఇబ్బంది పెట్టారో వారిపై కేసులు వేయబోతున్నామని వర్మ తెలిపారు. వీరిలో ఇంద్రసేనా చౌదరి, కేఏ పాల్, సెన్సార్ అధికారిణి జ్యోతిలు కూడా ఉన్నారని చెప్పారు. వీరందరిపైనా రూ.20 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments