Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ - శ్రీయాభూపాల్‌ల సయోధ్యకు ఉపాసన యత్నం?

ప్రేమికులు అఖిల్ అక్కినేని - శ్రీయాభూపాల్ రెడ్డిల మధ్య ఉన్న అభిప్రాయభేదాలను తొలగించి, వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన మధ్యవర్తిగా రంగంలోకి దిగనున్నారు. దీంతో అక్కినేని కుటుంబ

Webdunia
సోమవారం, 6 మార్చి 2017 (12:29 IST)
ప్రేమికులు అఖిల్ అక్కినేని - శ్రీయాభూపాల్ రెడ్డిల మధ్య ఉన్న అభిప్రాయభేదాలను తొలగించి, వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన మధ్యవర్తిగా రంగంలోకి దిగనున్నారు. దీంతో అక్కినేని కుటుంబంలో మళ్లీ ఆశలు చిగురించేలా కనిపిస్తున్నాయి.
 
నిజానికి అక్కినేని అఖిల్‌, శ్రీయాభూపాల్‌ల వివాహం వచ్చే మే నెలలో ఘనంగా జరిపించాలని భావించారు. అయితే అనూహ్య రీతిలో వారి పెళ్లి రద్దయినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అఖిల్‌, శ్రీయల మధ్య తలెత్తిన అభిప్రాయబేధాలే వివాహ రద్దుకు కారణమనే వార్తలు గుప్పుమంటున్నాయి. కానీ, ఈ వార్తలపై ఇటు నాగార్జున, అటు శ్రీయాభూపాల్ కుటుంబ సభ్యులు నోరు మెదపడం లేదు. 
 
ఈనేపథ్యంలో అఖిల్‌, శ్రీయల మధ్య విభేదాలను తొలగించేందుకు రామ్‌చరణ్‌ తేజ్‌ భార్య ఉపాసన రంగంలోకి దిగినట్టు వార్తలు వస్తున్నాయి. జీవీకే ఫ్యామిలీకి ఉపాసన కుటుంబానికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పైగా శ్రీయకు, ఉపాసన క్లోజ్‌ ఫ్రెండ్‌. అందుకే అఖిల్‌, శ్రీయల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఉపాసన ప్రయత్నిస్తోందట. ఉపాసన రాయభారం ఫలించి, అఖిల్‌, శ్రీయ ఒక్కటవ్వాలని ఇరు కుటుంబా సభ్యులు కోరుకుంటున్నారు. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments