Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ - శ్రీయాభూపాల్‌ల సయోధ్యకు ఉపాసన యత్నం?

ప్రేమికులు అఖిల్ అక్కినేని - శ్రీయాభూపాల్ రెడ్డిల మధ్య ఉన్న అభిప్రాయభేదాలను తొలగించి, వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన మధ్యవర్తిగా రంగంలోకి దిగనున్నారు. దీంతో అక్కినేని కుటుంబ

Webdunia
సోమవారం, 6 మార్చి 2017 (12:29 IST)
ప్రేమికులు అఖిల్ అక్కినేని - శ్రీయాభూపాల్ రెడ్డిల మధ్య ఉన్న అభిప్రాయభేదాలను తొలగించి, వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన మధ్యవర్తిగా రంగంలోకి దిగనున్నారు. దీంతో అక్కినేని కుటుంబంలో మళ్లీ ఆశలు చిగురించేలా కనిపిస్తున్నాయి.
 
నిజానికి అక్కినేని అఖిల్‌, శ్రీయాభూపాల్‌ల వివాహం వచ్చే మే నెలలో ఘనంగా జరిపించాలని భావించారు. అయితే అనూహ్య రీతిలో వారి పెళ్లి రద్దయినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అఖిల్‌, శ్రీయల మధ్య తలెత్తిన అభిప్రాయబేధాలే వివాహ రద్దుకు కారణమనే వార్తలు గుప్పుమంటున్నాయి. కానీ, ఈ వార్తలపై ఇటు నాగార్జున, అటు శ్రీయాభూపాల్ కుటుంబ సభ్యులు నోరు మెదపడం లేదు. 
 
ఈనేపథ్యంలో అఖిల్‌, శ్రీయల మధ్య విభేదాలను తొలగించేందుకు రామ్‌చరణ్‌ తేజ్‌ భార్య ఉపాసన రంగంలోకి దిగినట్టు వార్తలు వస్తున్నాయి. జీవీకే ఫ్యామిలీకి ఉపాసన కుటుంబానికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పైగా శ్రీయకు, ఉపాసన క్లోజ్‌ ఫ్రెండ్‌. అందుకే అఖిల్‌, శ్రీయల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఉపాసన ప్రయత్నిస్తోందట. ఉపాసన రాయభారం ఫలించి, అఖిల్‌, శ్రీయ ఒక్కటవ్వాలని ఇరు కుటుంబా సభ్యులు కోరుకుంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Travel Bag: 2 నెలల గర్భవతిని హత్య చేశాడు.. ట్రావెల్‌ బ్యాగ్‌లో కుక్కి పారేశాడు..

Man Mums, ఒక్కసారి వాటేసుకుంటే రూ. 600 చెల్లిస్తున్న యువతులు, ఎందుకిలా?

AP ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Drunk man: తాగిన మత్తులో పక్కింటి మహిళను భార్యగా భావించి ఏం చేశాడంటే?

పాక్ డ్రోన్ దాడితో దెబ్బతిన్న ఇళ్లు: నష్టపరిహారం రూ. 6500, బ్యాంక్ చెక్‌ను ఫ్రేమ్ కట్టించుకుంటానన్న బాధితుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments