Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్ ఫ్యాన్స్‌కు ప్రత్యేకం... ఆఫర్లు ప్రకటించిన ఎయిర్‌టెల్

Webdunia
మంగళవారం, 7 జనవరి 2020 (11:19 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం దర్బార్. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే, దేశంలో అతిపెద్ద ప్రైవేట్ టెలికాం సంస్థగా ఉన్న ఎయిర్‌టెల్ సంస్థ రజినీ ఫ్యాన్స్ కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రటించింది. 
 
దర్బార్ మూవీ టిక్కెట్లను గెలుచుకోవడంతోపాటు ఆ మూవీ నటీనటులను కలిసే బంఫర్‌ ఆఫర్‌ను ఎయిర్‌టెల్‌ అందిస్తున్నది. అందుకుగాను ఎయిర్‌టెల్‌ కస్టమర్లు దర్బార్‌ క్విజ్‌లో పాల్గొనాలి. ఎయిర్‌టెల్‌ కస్టమర్లు తమ ఫోన్లలో ఎయిర్‌టెల్‌ ఎక్స్‌స్ట్రీం యాప్‌ నూతన వెర్షన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక అందులో వచ్చే దర్బార్‌ క్విజ్‌లో పాల్గొని సమాధానాలు చెబితే చాలు.. విన్నర్లు దర్బార్‌ మూవీ టిక్కెట్లను గెలుచుకోవచ్చు. 
 
అలాగే ఆ మూవీ నటీనటులు, ఇతర సిబ్బందిని కలుసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ ఆఫర్‌ కేవలం ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇక 'దర్బార్‌' బ్రాండెడ్‌ సిమ్‌ పౌచ్‌లను కూడా లిమిటెడ్‌ ఎడిషన్‌ రూపంలో ఎయిర్‌టెల్‌ లాంచ్‌ చేసింది. వీటిని కొనుగోలు చేసిన వారికి అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోమింగ్‌, హై స్పీడ్‌ డేటా ఉండే ప్రీపెయిడ్‌ ప్యాక్‌లను అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భూమ్మీద ఇంకా నూకలున్నాయ్ ... ఒకే ఒక మృత్యుంజయుడు... (Video)

ఎయిరిండియా విమానం ఎలా కూలిపోయిందో చూడండి (Video)

ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!

విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments