Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్ ఫ్యాన్స్‌కు ప్రత్యేకం... ఆఫర్లు ప్రకటించిన ఎయిర్‌టెల్

Webdunia
మంగళవారం, 7 జనవరి 2020 (11:19 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం దర్బార్. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే, దేశంలో అతిపెద్ద ప్రైవేట్ టెలికాం సంస్థగా ఉన్న ఎయిర్‌టెల్ సంస్థ రజినీ ఫ్యాన్స్ కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రటించింది. 
 
దర్బార్ మూవీ టిక్కెట్లను గెలుచుకోవడంతోపాటు ఆ మూవీ నటీనటులను కలిసే బంఫర్‌ ఆఫర్‌ను ఎయిర్‌టెల్‌ అందిస్తున్నది. అందుకుగాను ఎయిర్‌టెల్‌ కస్టమర్లు దర్బార్‌ క్విజ్‌లో పాల్గొనాలి. ఎయిర్‌టెల్‌ కస్టమర్లు తమ ఫోన్లలో ఎయిర్‌టెల్‌ ఎక్స్‌స్ట్రీం యాప్‌ నూతన వెర్షన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక అందులో వచ్చే దర్బార్‌ క్విజ్‌లో పాల్గొని సమాధానాలు చెబితే చాలు.. విన్నర్లు దర్బార్‌ మూవీ టిక్కెట్లను గెలుచుకోవచ్చు. 
 
అలాగే ఆ మూవీ నటీనటులు, ఇతర సిబ్బందిని కలుసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ ఆఫర్‌ కేవలం ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇక 'దర్బార్‌' బ్రాండెడ్‌ సిమ్‌ పౌచ్‌లను కూడా లిమిటెడ్‌ ఎడిషన్‌ రూపంలో ఎయిర్‌టెల్‌ లాంచ్‌ చేసింది. వీటిని కొనుగోలు చేసిన వారికి అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోమింగ్‌, హై స్పీడ్‌ డేటా ఉండే ప్రీపెయిడ్‌ ప్యాక్‌లను అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments