Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో రాజేంద్ర ప్రసాద్: ప్రతినాయకుడిగా మారనున్న..?!

ప్రతినాయకుడిగా మారనున్న రాజేంద్రప్రసాద్: తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం!

Webdunia
గురువారం, 31 మార్చి 2016 (15:56 IST)
మా అధ్యక్షుడు, నటుడు డా.రాజేంద్రప్రసాద్‌ తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డు సాధించారు. ఒక పత్రికపై వరుసగా పదేళ్లు ఆయన ఫొటో ముఖ చిత్రంగా వచ్చినందుకు ఆయనకు ఈ రికార్డ్‌ దక్కింది. ఫిలింనగర్‌లోని చలనచిత్ర నిర్మాతల హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ రికార్డును ప్రదానం చేశారు. కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ, వెంకటేశ్వరరావు, రామకృష్ణ గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.
 
ఇదిలా ఉంటే హీరోగానే కాకుండా సపోర్టింగ్ రోల్స్‌లో ఎప్పటి నుంచో నటిస్తూ వస్తున్న రాజేందప్రసాద్.. ప్రస్తుతం సరికొత్తగా ప్రతినాయకుడిగా మారబోతున్నాడని తెలిసింది. ఏ పాత్రకైనా న్యాయం చేయగల సత్తా ఉన్న విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్. అందుకే ఆయన్ను ప్రతి నాయకుడిగా మార్చేందుకు దర్శక నిర్మాతలు రెడీ అవుతున్నారు. 
 
ఈ మధ్యే ఓ స్టార్ డైరెక్టర్ సినిమాలో రాజేంద్ర ప్రసాద్‌ను విలన్‌గా పెట్టేందుకు రంగం సిద్ధం చేశాడట. స్క్రిప్ట్ విన్న రాజేంద్రప్రసాద్ విలన్‌గా కూడా ఓకే అన్నట్టు తెలుస్తోంది. తన కెరీర్‌లో ఎన్నో రకాల పాత్రల్లో అలరించి మెప్పించిన రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు విలన్‌గా మారడం ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగిస్తోంది. 
 
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పటికే మహేష్ బాబు శ్రీమంతుడు, ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో వంటి పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషించిన రాజేంద్ర ప్రసాద్ తనలోని మరో కోణాన్ని చూపించేందుకు సిద్దమయ్యారు.

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments