దర్శకుడు రాజమౌళి బాహుబలి సినిమా పైరసీ రాకుండా వివిధ మాద్యమాల్లో వస్తే వాటిని ఎలా అరికట్టవచ్చో అనే కొత్త టెక్నాలజీని ప్రవేశపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన టీమ్లో టెక్నికల్ విషయాలు తెలిసిన మేథావులు వున్నారు. వారి సూచన మేరకు ముందుగా ఎక్కడైనా లీక్ అయినా ఎలా అయింది? అనేది తెలిసిపోతుందట. ఇందుకు హాలీవుడ్ టెక్నీషియన్ల సూచనలు కూడా తీసుకుంటున్నాడు.
ఇప్పటికే ఆన్లైన్ పైరసీపై ఓ కన్నేసి వుంచారు. సైబర్ పోలీసులకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వారిని కంట్రోల్ చేయడానికి. క్రియేటివ్గా తీసిన ఈ సినిమాను పెద్ద తెరపై చూస్తేనే దాని ఫీల్ వుంటుందని.. పైరసీని ప్రోత్సహించకండి అంటూ స్లోగన్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.