Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యాహ్నం 12 గంటలకు నా ఫేస్‌బుక్ పేజీని మిస్ కావొద్దు: రాజమౌళి

తెలుగు సినిమా చరిత్రలో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌గా పేరొందిన బాహుబలి 2 సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రెండు పార్టులు కలిసి రూ. 200 నుండి 250 కోట్లలో సినిమాను పూర్తి చేయాలనే

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (09:49 IST)
తెలుగు సినిమా చరిత్రలో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌గా పేరొందిన బాహుబలి 2 సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రెండు పార్టులు కలిసి రూ. 200 నుండి 250 కోట్లలో సినిమాను పూర్తి చేయాలనే అంచనాతో ప్రారంభించారు. 'బాహుబలి-ది బిగినింగ్' ఊహించిన దానికంటే భారీ విజయం సాధించింది. ఈ చిత్రం దాదాపు 650 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. 
 
మొదటి భాగం భారీ విజయం సాధించడం, భారీ వసూళ్లు రాబట్టడంతో రెండో భాగం 'బాహుబలి-ది కన్‌క్లూజన్' పై నిర్మాతలు ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే ఖర్చు పెట్టారని తెలుస్తోంది. ప్రీ రిలీజ్‌లోనే బాహుబలి 2 బాగా సంపాదించేసిందని టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. తాజాగా శనివారం మధ్యాహ్నం 12 గంటలకు బాహుబలి ఫేస్ బుక్ పేజీని మిస్ కావద్దని దర్శక దిగ్గజం రాజమౌళి పిలుపునిచ్చారు. ఈ మేరకు 'బాహుబలి' అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును ఉంచారు. 
 
'బాహుబలి: ది కన్ క్లూజన్'పై లైవ్ ఉంటుందన్నారు. కాగా, ఈ లైవ్ లో ఆయన స్వయంగా పాల్గొని అభిమానులు అడిగే ప్రశ్నలకు స్వయంగా సమాధానాలు ఇస్తారని తెలుస్తోంది. ఫేస్ బుక్ లో 'baahubalimovie' ద్వారా ఈ లైవ్ ను వీక్షించవచ్చని రాజమౌళి తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments