Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీచక్రం గురించి చర్చిస్తూ రహస్యం ఇదం జగత్‌ చిత్రం రాబోతుంది

డీవీ
సోమవారం, 14 అక్టోబరు 2024 (16:01 IST)
Rahasyam poster
సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథాలాజికల్‌ థ్రిల్లర్స్‌గా రహస్యం ఇదం జగత్‌ రాబోతుంది. ఈ చిత్రంలో నేటి తరం ప్రేక్షకులను అలరించే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వున్నాయని ఈ చిత్రం ప్రమోషన్‌ కంటెంట్‌ చూస్తే అర్థమవుతోంది. మన పురాణాలు, ఇతిహాసాల గురించి... శ్రీచక్రం గురించి చర్చిస్తూ ఓ కొత్త అనుభూతిని కలిగించడానికి రాబోతున్న చిత్రం రహస్యం ఇదం జగత్‌. 
 
నవంబరు 8న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రాకేష్‌ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్‌ గోపీనాథం ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని  సింగిల్‌ సెల్‌ యూనివర్శ్‌ ప్రొడక్షన్‌ పతాకంపై కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం టీజర్‌ను అమెరికాలోని డల్లాస్‌లో విడుదల చేశారు. 
 
ఆ టీజర్‌కు అందరి నుంచి మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఈ జగమే విధిగా అనే లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్‌. గ్యాని సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ పాటను హారిక నారాయణ్‌ అండ్‌ గ్యానీ ఆలపించారు. రమేష్‌ కుమార్‌ వక్కచర్ల సాహిత్యం అందించారు. చూడగానే ఆకట్టుకునే విజువల్స్‌తో, క్యాచీ లిరిక్స్‌, ట్యూన్‌తో అందర్ని ఈ  పాట అలరిస్తోంది. 
 
నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ సైన్స్‌ ఫిక్షన్‌కు మైథాలాజికల్‌ అంశాలు జోడించి నేటి తరం ప్రేక్షకులను మెప్పు పొందే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ప్రమోషన్‌ల్‌ కంటెంట్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ గ్లింప్స్‌కు, టీజర్‌కు  అనూహ్యమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా మన శ్రీచక్రం, శ్రీ యంత్రం, మన చారిత్రాత్మక చరిత్ర గురించి చెబుతున్న పాయింట్‌ ఈ చిత్రం పట్ల అందరిలోనూ ఆసక్తిని పెంచింది. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుందని నమ్మకంగా చెప్పగలను. ఆడియన్స్‌ ఇంట్రెస్ట్‌ కలిగించే అంశాలతో పాటు స్టనింగ్‌ వుండే విజువల్స్‌ కూడా ఈ చిత్రంలో వుంటాయి.  తప్పకుండా ఈ చిత్రం అందర్ని సర్‌ఫ్రైజ్‌ చేస్తుంది. నవంబరు 8న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం' అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంధువుల ఇంటికి వెళ్లిన చిన్నారి శవమై కనపించింది... ఎలా?

వైకాపా ఓటమికి రాజధాని అమరావతి కూడా ఓ కారణం : జోగి రమేశ్

నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేశ్వల రాజధానినా?

ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

కిడ్నీ సమస్యలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments