Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాధికా ఆప్టే అంటే ఏమనుకున్నారు.. గోవా ఫిలిమ్ ఫెస్టివల్‌లో జ్యూరీగా ఎంపిక!

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2015 (12:38 IST)
రాధికా ఆప్టే అరుదైన గౌరవం దక్కింది. భారత్‌లో చాలా ప్రతిష్టాత్మకంగా భావించే.. గోవాలో జరగబోయే ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో రాధికా ఆప్టే జ్యూరీ సభ్యురాలిగా ఎంపికైంది. సాధారణం ఈ ఫిలిమ్ ఫెస్టివల్‌లో జ్యూరీ సభ్యులుగా మహా మహులే ఉంటారు. వాళ్ల స్టాండర్స్ ఇంటర్నేషనల్ రేంజిలో ఉంటాయి. అలాంటి జ్యూరీలో రాధికకు చోటు దక్కడం ద్వారా ఆమె లెవలేంటో అర్థం చేసుకోవాలని సినీ పండితులు అంటున్నారు. 
 
గత ఏడాది కొరియోగ్రాఫర్ కమ్ డైరక్టర్ ఫరా ఖాన్‌కు జ్యూరీలో స్థానం లభించగా... ఆమె స్థానంలో ప్రస్తుతం రాధికా ఆప్టేను తీసుకున్నారు. ఇది తనకు అరుదైన గౌరవమని.. ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని రాధికా ఆప్టే వెల్లడించింది. ఈ ఫిలిం ఫెస్టివల్ 20న మొదలై పది రోజుల పాటు కొనసాగుతుంది.
 
కాగా రాధికా ఆప్టే భారత్‌లో అత్యధిక మంది గూగుల్ సెర్చ్‌లో వెతికిన హీరోయిన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు బద్లాపూర్ - హంటర్ లాంటి సినిమాలతో.. ‘అహల్య’ లాంటి ఇంటర్నేషనల్ రేంజి షార్ట్ ఫిలింతో తనేంటో రాధిక చాటి చెప్పింది. 

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Show comments