Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాక్‌తో నిమిత్తం లేకుండా కలెక్షన్లలో దుమ్మరేపుతున్న 'రాధేశ్యామ్'

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (15:53 IST)
ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం "రాధేశ్యామ్". రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ నెల 11వ తేదీన విడుదలైన ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. తొలి రోజున ఏకంగా రూ.79 కోట్ల హైయ్యర్ గ్రాస్‌ను వసూలు చేసిన "రాధేశ్యామ్" రెండో రోజుకు ఇది రూ.119 కోట్లకు చేరుకుంది. మూడు రోజుల్లో రూ.151 కోట్లను క్రాస్ చేసింది. 
 
నిజానికి ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. కానీ, టాక్‌తో నిమిత్తం లేకుండా కలెక్షన్లు మాత్రం దుమ్మురేపుతోంది. ప్రేమకీ విధికి మధ్య సంఘర్షణ నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రచార చిత్రాలు మరిన్ని అంచాలన్ని పెంచాయి. ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటించగా, కృష్ణంరాజు ఓ కీలక పాత్రను పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం గత మూడు రోజుల్లో భారీ కలెక్షన్లను రాబట్టింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా దేశ వ్యాప్తంగా, వరల్డ్ బాక్సాఫీస్ వద్ద కూడా దుమ్మురేపుతుంది. 
 
కాగా, ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా నటించారు. రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. రాజమౌళి ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చగా, తమన్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Karnataka: అత్తమామల గొడవ.. రాజీ కోసం వెళ్ళి ప్రాణాలు కోల్పోయాడు

ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచేసిన తెలంగాణ సర్కారు

ఉద్యోగం పేరుతో యువతిని మోసం చేసిన తల్లీకొడుకు .. ఆపై అశ్లీల చిత్రాల్లో నటించాలంటూ..

ప్రియురాలిని హోటల్ గదికి తీసుకెళ్లి చంపేసిన ప్రియుడు

Girl: మైనర్ గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం- ఎనిమిది మంది అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments