Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారెడు పల్లి అడవుల్లో ‘పుష్ప’ షూటింగ్...

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (19:15 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా.. సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమా ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రానున్న ఈ మూవీలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‏గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై అభిమానుల అంచనాలు తీవ్రంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం మారెడు పల్లి అడవుల్లో ‘పుష్ప’ టీం చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోంది. 
 
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను కేవలం ఐదు భాషల్లోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో విడుదల చేసేందుకు భావిస్తున్నాడు సుకుమార్. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‏డేట్ బయటకు వచ్చింది.
 
ప్రస్తుతం మారెడు పల్లి అడవుల్లో ‘పుష్ప’ షూటింగ్ జరుగుతుండగా.. అనంతరం పారిన్‏ వెళ్ళనున్నారట చిత్రయూనిట్. ఫారిన్ ఎందుకు వెళ్ళనున్నారంటే.. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారట. 
 
ఇక అక్కడి ట్విస్టుతోనే ఇక్కడి అడవుల్లో అసలు కథ మొదలవుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పాత్రలో మరో కోణం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక అల వైకుంఠపురం తర్వాత ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్లో భారీ హిట్ కొట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లుగా తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments