Webdunia - Bharat's app for daily news and videos

Install App

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ క్లాప్‌... కళ్యాణ్‌రామ్‌-పూరి జగన్నాథ్‌ చిత్రం ప్రారంభం

డేరింగ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నటిస్తూ యన్‌.టి.ఆర్‌. ఆర్ట్స్‌ బేనర్‌పై డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న భారీ చిత్రం షూటింగ్‌ ఏప్రిల్‌ 29 ఉదయం 9.50 నిమిషాలకు రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయింది. విశ్వవిఖ

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (20:47 IST)
డేరింగ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నటిస్తూ యన్‌.టి.ఆర్‌. ఆర్ట్స్‌ బేనర్‌పై డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న భారీ చిత్రం షూటింగ్‌ ఏప్రిల్‌ 29 ఉదయం 9.50 నిమిషాలకు రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయింది. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న డా. ఎన్‌.టి. రామారావు చిత్ర పటంపై చిత్రీకరించిన ముహూర్తం షాట్‌కు యంగ్‌టైగర్‌ క్లాప్‌ కొట్టగా, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. కొరటాల శివ ఫస్ట్‌ షాట్‌కు దర్శకత్వం వహించారు. సాహసరత్న నందమూరి హరికృష్ణ, నందమూరి రామకృష్ణ పూజా కార్యక్రమాల్ని నిర్వహించారు. 
 
ఈ చిత్రం గురించి దర్శకుడు పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ - ''రొమాన్స్‌, యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ అన్నీ వుంటూనే సరికొత్త స్టైల్‌లో సాగే కమర్షియల్‌ ఫిల్మ్‌ ఇది. ఇందులో కొత్త కళ్యాణ్‌రామ్‌ని చూస్తారు. మే లోనే రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేసి ఓ షెడ్యూల్‌ స్పెయిన్‌లో చేస్తాం. హీరోగా కళ్యాణ్‌రామ్‌ ఇమేజ్‌ని మరింత పెంచే సినిమా అవుతుంది'' అన్నారు.
 
హీరో, నిర్మాత నందమూరి కళ్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ - ''పూరి జగన్నాథ్‌గారి దర్శకత్వంలో మా స్వంత బేనర్‌లో సినిమా చెయ్యడం చాలా ఆనందంగా వుంది. జగన్‌ గారు కథ చెప్పినప్పట్నుంచీ ఎంతో ఎగ్జైట్‌ అవుతున్నాను. నా కెరీర్‌కి ఇది మరో టర్నింగ్‌ పాయింట్‌ అవుతుంది'' అన్నారు.
 
నందమూరి కళ్యాణ్‌రామ్‌ సరసన ఆదితి ఆర్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తారు. మిగిలిన తారాగణం ఎంపిక జరుగుతోంది. ఈ భారీ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఫొటోగ్రఫీ: ముఖేష్, నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments