Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవరకొండ లాంటి హీరోను చూడలేదు : పూరీ జగన్నాథ్

Webdunia
సోమవారం, 15 ఆగస్టు 2022 (12:09 IST)
విజయ్ దేవరకొండ వంటి హీరోను తాను ఇంతవరకు తాను చూడలేదని, లైగర్ చిత్రం తర్వాత ఆయన మరో స్థాయికి చేరుకుంటాడని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. విజయ్ దేవరకొండ - పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో "లైగర్" చిత్రం తెరకెక్కింది. ఈ నెల 25వ తేదీన పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. దీంతో ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఇందులోభాగంగా, ఆదివారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో పూరీ జగన్నాథ్ పాల్గొని ప్రసంగించారు. 
 
"అర్జున్ రెడ్డి సినిమా చూసినపుడే విజయ్‌తో ఓ చిత్రం చేయాలని ఫిక్స్ అయ్యాను. విజయ్ సినిమాల్లోనే కాదు బయటకూడా అంతే నిజాయితీగా ఉంటాడు. తనలో నేను ఇష్టపడేది అదే. నిర్మాతగా నేను ఒక రోజున రూ.2 కోట్లు పంపించాను. మాకు వేరే చోట అప్పు ఉందని తెలిసిన తను ముందుగా ఆ అప్పు తీర్చమని ఆ డబ్బు వెనక్కి పంపించారు. 
 
ఈ రోజుల్లో కూడా ఇలాంటివారు ఉంటారా చెప్పండి. ఒక నిర్మాత కష్టాల్లో ఉన్నపుడు అండగా నిలబడేవాళ్లు ఎవరు? విజయ్ లాంటి హీరోను నేను ఇంతవరకు చూడలేదు. నా కష్టాలు తనవిగా భావించి అండగా నిలిచారు. ఆయనకు హ్యాట్సాఫ్ చెబుతున్నాను అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటుతుందా?

డబ్బు కోసం వేధింపులు.. ఆ వీడియోలున్నాయని బెదిరించారు.. దంపతుల ఆత్మహత్య

వైకాపా నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన టీడీపీ నేత జేసీ

పొరుగు గ్రామాలకు చెందిన ఇద్దరు యువతులతో ప్రేమ... ఇద్దరినీ పెళ్లాడిన యువకుడు!

నరకం చూపిస్తా నాయాలా? టెక్కలిలో ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తాను : దువ్వాడ శ్రీనివాస్ చిందులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments