Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంకా పేరు ప్రకటించని సినిమాలో హీరోయిన్‌కు కనీవినీ ఎరుగని పారితోషికం

సినీరంగంలో ప్రవేశించి కొంత కాలమైనా కాలేదు. ఆ హీరోయిన్‌కు వరుస సినిమాలు దొరుకుతున్నాయి. దీంతో ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఆమె తన రెమ్యునరేషన్‌ను పెంచేసింది. బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా శ్రీవాస్‌ రూపొందిస్తోన్న చిత్రంలో నాయికగా ప

Webdunia
గురువారం, 8 జూన్ 2017 (02:38 IST)
సినీరంగంలో ప్రవేశించి కొంత కాలమైనా కాలేదు. ఆ హీరోయిన్‌కు వరుస సినిమాలు దొరుకుతున్నాయి. దీంతో ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఆమె తన రెమ్యునరేషన్‌ను పెంచేసింది. బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా శ్రీవాస్‌ రూపొందిస్తోన్న చిత్రంలో నాయికగా పూజా హెగ్డే ఎంపికైనట్లు విశ్వసనీయ సమాచారం. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్‌ మేఘన ఆర్ట్స్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రం మే 21న లాంఛనంగా ప్రారంభమైంది. 
 
జగపతిబాబు, రవికిషన, అశుతోష్‌ రాణా, మధు గురుస్వామి (కన్నడ నటుడు) ప్రతినాయకులుగా నటిస్తోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ నాయిక ఎవరనేది సస్పెన్సగా ఉండింది. తాజాగా ఆ పాత్రను చేయడానికి పూజ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఇప్పటివరకూ ఏ సినిమాకూ తీసుకోనంత పారితోషికాన్ని ఈ సినిమాకు ఆమె అందుకోనున్నట్లు అంతర్గత వర్గాల సమాచారం. 
 
ఈ సినిమా తొలి షెడ్యూల్‌ ఈ నెల 12 నుంచి పది రోజుల పాటు రామోజీ ఫిల్మ్‌సిటీలో జరగనుంది. హీరో, విలన్లు, మరికొంతమంది ఆర్టిస్టులపై సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. జూలై మొదటి వారం నుంచి నిర్వహించే రెండో షెడ్యూల్‌లో హీరోయిన పూజ సెట్స్‌పై అడుగుపెట్టనున్నారు. దర్శకుడిగా శ్రీవాస్‌కు ఇది ఆరవ చిత్రం ‘‘ఇప్పటివరకూ నేను చేయని భిన్నమైన తరహా కథతో ఈ సినిమా చేస్తున్నా. బెల్లంకొండ శ్రీనివాస్‌ను సరికొత్త రీతిలో చూపించబోతున్నా. దీనికి నేనే రచన చేస్తున్నా. చూసినవాళ్లంతా ‘వెల్‌మేడ్‌ మూవీ’ అంటారు’’ అని ఆయన చెప్పారు.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments