Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్శకుడిగా మారిన థర్టీ ఇయర్ ఇండస్ట్రీ.. ఆయన కుమార్తె హీరోయిన్‌!

Webdunia
ఆదివారం, 29 జనవరి 2023 (17:54 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో థర్టీ ఇయర్ ఇండస్ట్రీగా గుర్తింపు పొందిన నటుడు పృథ్వీరాజ్. ఇపుడు ఆయన దర్శకుడుగా అవతారమెత్తారు. గతంలో రాజకీయాల్లో కొంత కాలం బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఏపీలోని వైకాపాలో ఆయన చేరి, ఎస్వీబీసీ చానెల్ ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. ఆ తర్వాత ఓ వివాదంలో చిక్కుకుని ఆ పదవికి రాజీనామా చేశారు.
 
ఆ తర్వాత ఆయన వైకాపాకు రాజీనామా చేసి, జనసేన పార్టీలో చేరారు. ఈ క్రమంలో తాజాగా ఆయన దర్శకుడిగా అవతారమెత్తి, తన ప్రతిభను చాటుకోవాలని చూస్తున్నారు. ఈయన దర్శకత్వంలో కొత్త రంగుల ప్రపంచం అనే చిత్రం తెరకెక్కనుంది. ఇందులో ఆయన కుమార్తె శ్రీలు హీరోయిన్‌గా నటించడం గమనార్హం. క్రాంతి కృష్ణ హీరోగా ఎంపిక చేశారు.
 
విజయ రంగరాజు, అశోక్ కుమార్, గీతాసింగ్, జబర్దస్త్ నవీన్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. శ్రీ పీఆర్ క్రియేషన్స్ బ్యానరుపై పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి, కర్రి కృష్ణారెడ్డిలు కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది. తాజా చిత్రం గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments