Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊరి కోసం కళ్యాణ మండపం క‌ట్టించిన‌ నిర్మాత రామాంజనేయులు

Webdunia
శుక్రవారం, 29 అక్టోబరు 2021 (17:00 IST)
Ramanjaneyulu, Dr. Gopireddy Srinivasareddy and others
ప్రముఖ పారిశ్రామికవేత్త నిర్మాత జవ్వాజి రామాంజనేయులు గ్రామ ప్రజల కోసం గురువారంనాడు శ్రీ సీతా నరసింహాగార్డెన్స్‌ను ప్రారంభించారు. నిర్మాత జవ్వాజి రామాంజనేయులు ఓ సారి తన గ్రామంలోని ఓ ఇంట్లో విందు కార్యక్రమానికి హాజరయ్యారంట, ఆరోజే స‌డ‌న్‌గా వర్షం పడటంతో ఎంతో ఆహారం వృథాగా పోయింద‌ట‌. భ‌విష్య‌త్తులో అలాంటి సమస్యలు తన గ్రామస్థులకు ఎదురుకాకుండా ఉండేందుకే  శ్రీ సీతా నరసింహాగార్డెన్స్‌ను ప్రారంభించాన‌ని తెలిపారు. ఈ ప్రారంబోత్స‌వ‌ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయలు, అద్దంకి వినుకొండ గురజాల శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్ రెడ్డి, నరసరావుపేట టీడీపీ ఇన్చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. 
 
తనకు జన్మనిచ్చిన గ్రామానికి సేవ చేయాలనే ఆలోచనతో గ్రామస్తులు ఉపయోగపడే ఆధునాతన కళ్యాణ మండపం నిర్మించానని, గోగులపాడు గ్రామంతో పాటు పరిసర గ్రామాల వారికి అందుబాటులో ఉండే విధంగా వివాహాది శుభకార్యములకు ఉపయోగపడే విధంగా కళ్యాణ  మండపం ఏర్పాటు చేశానని తెలిపారు. 
 
ఈ క‌ళ్యాణ‌మండ‌పాన్ని వారి గ్రామంతో పాటు చుట్టు ప్ర‌క్క‌ల గ్రామాల వారు శుభకార్యాలకు ఉచితంగా ఉపయోగించుకునే సదుపాయం కలుగజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan With Vijayamma: వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ అంత్యక్రియలకు విజయమ్మ-జగన్

Krystyna Pyszkova: యాదగిరి గుట్టలో మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్జ్కోవా (video)

ఓటర్ గుర్తింపు - ఆధార్ కార్డుల అనుసంధానానికి కేంద్రం పచ్చజెండా!

వరంగల్ అమ్మాయి, అమెరికా అబ్బాయి.. తెలంగాణలో డుం.. డుం.. డుం.. (Video)

విజయవాడలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు ప్రారంభం- బాబు, పవన్ కూడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments