Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధికారుల తీరుపై నిర్మాత నట్టి కుమార్ ఆగ్రహం

Webdunia
ఆదివారం, 8 ఆగస్టు 2021 (19:58 IST)
Natti Kumar
విశాఖపట్నం జిల్లాలోని చోడవరంలోని సాయిలక్ష్మీ థియేటర్ బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముతూ ప్రేక్షకుల డబ్బులు దోచుకోవడంతో పాటు ప్రభుత్వ విధానాలకు, ఆదాయనికి తూట్లు పొడుస్తోందని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సాయిలక్ష్మీ థియేటర్ యజమానులైన బాబ్జి, పవన్ లు తమ అనుయాయులతో ఎస్.ఆర్. కల్యాణమండపం సినిమా 35 రూపాయల టిక్కెట్లను 100 రూపాయలకు బ్లాక్ లో బహిరంగంగా అమ్ముతున్నా అధికారులు, పోలీసులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని నట్టి కుమార్ ఆరోపించారు. 
 
స్థానిక ఎం.ఆర్.ఓ, ఆర్డీవో లకు ఈ విషయంపై ఫిర్యాదు చేసినా వారు చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని ఆయన తెలిపారు. జీ.ఓ. 35 ను అమలు పరచకుండా జీఎస్టీ కట్టకుండా ప్రభుత్వ ఆదాయాన్ని నష్టపరుస్తున్న బాబ్జి, పవన్ లను అరెస్ట్ చేయడంతో పాటు, స్థానిక ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్, కలెక్టర్లకు నట్టికుమార్ డిమాండ్ చేశారు. 
 
అలాగే విశాఖ జిల్లాలోని ఇంకొన్ని థియేటర్లు కూడా ఇలానే బ్లాక్ టిక్కెట్లకు పాల్పడుతున్నారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకుని వెళతానని, అవసరమైతే హైకోర్టుకు వెళ్లడానికి కూడా సిద్ధమేనని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ దందాపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని, ఆ యజమానులపై కేసులు పెట్టి అరెస్ట్తా చేస్తారని తాను ఆశిస్తున్నట్లు నట్టి కుమార్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహ వయసు 20 యేళ్లు ఉండటం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయ్...

భర్త గల్లా పట్టుకుని లాగికొట్టిన బాక్సర్ స్వీటీ బూరా (Video)

Two sisters: ఫుడ్ పాయిజనింగ్.. ఇధ్దరు సిస్టర్స్ మృతి.. తండ్రి, కుమార్తె పరిస్థితి విషమం

ఛత్రపతి శివాజీపై నాగ్‌పూర్ జర్నలిస్ట్ అనుచిత వ్యాఖ్యలు - అరెస్టు

పూజ పేరుతో నయవంచన... ప్రశ్నించినందుకు సామూహిక అత్యాచారం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments