దర్శకుడు శంకర్‌తో మా జర్నీ అలా మొదలైంది : నిర్మాత దిల్ రాజు

ఠాగూర్
మంగళవారం, 24 డిశెంబరు 2024 (09:18 IST)
సినీ దర్శకుడు శంకర్‌తో తమకున్న అనుభవాన్ని బడా నిర్మాత దిల్ రాజు తాజాగా వెల్లడించారు. హీరో అర్జున్ నటించిన 'ఒకే ఒక్కడు' చిత్రం నుంచి మా జర్నీ ప్రారంభమైందన్నారు. నాడు దర్శకుడు శంకర్, చంద్రబాబుల చేతుల మీదుగా వంద రోజుల షీల్డ్ తీసుకున్నట్టు చెప్పారు. అలాగే, శంకర్ నిర్మించిన "వైశాలి" చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసినట్టు చెప్పారు. అప్పటి నుంచి శంకర్‌తో జర్నీ చేస్తున్నామని, ఇపుడు "గేమ్ ఛేంజర్‌"ను నిర్మించినట్టు చెప్పారు. 
 
తాజాగా డల్లాస్‌లో జరిగిన గేమ్ ఛేంజర్ ఈవెంట్‌లో ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు పాల్గొని మాట్లాడుతూ, శంకర్‌ మాతో సినిమా చేయాలని, తెలుగు సినిమా చేయాలని అనుకుంటున్నారని మా కో- డైరెక్టర్ గారి ద్వారా తెలిసింది. రామ్ చరణ్ అప్పుడు 'ఆర్ఆర్ఆర్' షూటింగులో ఉన్నారు. అప్పుడు ఈ కథ ఆయనకు చెప్పడం, నచ్చడం అలా జర్నీ మొదలైంది. మా బ్యానరులో ఇది 50వ సినిమా. ఇంత పెద్ద బడ్జెట్‌తో నేను ఎప్పుడూ సినిమాలు తీయలేదు. కరోనా వల్ల కాస్త ఆలస్యమైంది.
 
డోప్ సాంగ్‌ను ముందుగా నేను ఫోన్ చూశా. ఈ పాటను డల్లాస్‌లో రిలీజ్ చేస్తున్నామని తెలిసి నాకు సంతోషం వేసింది. ఈ పాటను చూసినప్పుడు నాకు కంట్లోంచి ఆనందబాష్పాలు వచ్చాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వల్లే ఈ సినిమా ఈ స్థాయికి వచ్చింది.
 
నేను చిరంజీవి చిత్రాలను ఒక ప్రేక్షకుడిలా ఎంజాయ్ చేశా. కానీ 'తొలిప్రేమ' సినిమాతో డిస్ట్రిబ్యూటర్‌గా ఎంజాయ్ చేశాను. కళ్యాణ్‌తో సినిమా తీయడానికి నాకు చాలా టైం పట్టింది. మెగా ఫ్యామిలీతో ఉన్న బాండింగ్‌తో 'ఎవడు' చేశాం. అది రిలీజై 11 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు 'గేమ్ చేంజర్'తో మళ్లీ సంక్రాంతికి రాబోతోంది. ఈ సారి మామూలుగా కొట్టడం లేదు. గట్టిగా కొట్టబోతోన్నాం అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

PM Modi Gifts to Putin: పుతిన్‌కు భగవద్గీతను బహూకరించిన ప్రధాని మోదీ

IndiGo: ఇండిగో విమానాల రద్దు.. కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

అర్థరాత్రి మహిళను లాక్కెళ్లి గ్రామ సచివాలయంలో అత్యాచారం

సీబీఐ కేసును కొట్టివేయాలి.. వై. శ్రీలక్ష్మి పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఆదేశాలు రిజర్వ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments