Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పొలం విషయంలో హీరో రవితేజను మోసం చేశా : నిర్మాత బండ్ల గణేష్

కమెడియన్‌ స్థాయి నుంచి స్టార్‌ ప్రొడ్యూసర్‌గా ఎదిగిన వారిలో బండ్ల గణేష్ ఒకరు. ఈయన పవన్ కళ్యాణ్‌, జూ.ఎన్టీయార్‌, మాస్ మహారాజా రవితేజ, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ వంటి హీరోలతో పలు చిత్రా

Webdunia
గురువారం, 26 జనవరి 2017 (15:47 IST)
కమెడియన్‌ స్థాయి నుంచి స్టార్‌ ప్రొడ్యూసర్‌గా ఎదిగిన వారిలో బండ్ల గణేష్ ఒకరు. ఈయన పవన్ కళ్యాణ్‌, జూ.ఎన్టీయార్‌, మాస్ మహారాజా రవితేజ, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ వంటి హీరోలతో పలు చిత్రాలు నిర్మించాడు. 
 
ఆ తర్వాత జూనియ్ ఎన్టీఆర్‌తో ‘టెంపర్‌’ సినిమా తీశాడు. ఈ చిత్రం తర్వాత ఆయన ఒక్కసారి అదృశ్యమైపోయాడు. తాజాగా పవన్‌తో దిగిన ఫోటోను ట్వీట్‌ చేసి మళ్లీ వార్తల్లోకెక్కాడు బండ్ల గణేష్‌. తాజాగా ఓ మీడియా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో పలు ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. గతంలో ఓసారి హీరో రవితేజను మోసం చేశానని అంగీకరించాడు. రవితేజ ఎంతో ఇష్టపడి తన దగ్గర పొలం కొనుక్కున్నాడని, అయితే ఆ పొలం విషయంలో ఆయనను మోసం చేశానని తెలిపాడు. 
 
అలాగే జూనియర్‌ ఎన్టీయార్‌తో చేసిన ‘బాద్‌షా’ సినిమా వల్ల తాను ఎంతో నష్టపోయానని, అప్పట్నుంచే ఎన్టీయార్‌తో విభేదాలు ఏర్పడ్డాయని చెప్పాడు. ఇక, తన దేవుడు పవన్‌ కళ్యాణ్‌కు ఎవరూ సహాయం చేయనవసరం లేదని, తన సమస్యను ఆయనే పరిష్కరించుగోలడని అన్నాడు. అలాగే ఓ దర్శకుడు రాత్రంతా మందు కొడుతూ, డ్రగ్స్‌ తీసుకుంటూ గడుపుతాడని, ఆయనతో పనిచేయడం తన దురదృష్టమన్నాడు. ఆ దర్శకుడి పేరు చెప్పడానికి మాత్రం బండ్ల గణేష్ నిరాకరించాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments