Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదిలే రైలు ఎక్కిన జూనియర్ ఆర్టిస్టు మృతి: రైల్వే నిర్లక్ష్యమే కారణమంటూ..?

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (08:55 IST)
జూనియర్ ఆర్టిస్టు ప్రాణాలు కోల్పోయింది. చిన్న పొరపాటు జూనియర్ ఆర్టిస్టు ప్రాణం తీసింది. ఈ ఘటన షాద్‌నగర్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... కడపకు చెందిన జ్యోతిరెడ్డి (28) హైదరాబాద్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే జూనియర్ ఆర్టిస్టుగానూ పనిచేస్తోంది. సంక్రాంతి పండుగ కోసం సొంతూరు వెళ్లిన జ్యోతి సోమవారం రాత్రి తిరిగి హైదరాబాద్ పయనమైంది. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున రైలు షాద్‌నగర్ రైల్వే స్టేషన్‌లో ఆగింది.
 
రైలు ఆగడంతో కాచిగూడ వచ్చేశామని భావించిన జ్యోతి రైలు దిగేసింది. అయితే, ఆ తర్వాత అది షాద్‌నగర్ అని తెలుసుకుని కంగారుపడింది. అప్పటికే రైలు కదలడంతో రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించి అదుపుతప్పి కిందపడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే రైల్వే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జ్యోతి మృతి చెందింది. విషయం తెలిసిన జూనియర్ ఆర్టిస్టులు జ్యోతి మృతికి రైల్వే నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.
 
జ్యోతిరెడ్డి మృతితో ఆమె కుటుంబ సభ్యులు, జూనియర్ ఆర్టిస్టులు ఆ ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఛాదర్‌ఘాట్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులు, జూనియర్ ఆర్టిస్టులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం మృతదేహాన్ని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. జ్యోతిరెడ్డి మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

ఎగ్జిట్ పోల్స్ నోట - కోమటి పల్స్ మాట

కేకే సర్వేస్ ఎగ్జిట్ పోల్ నిజమైతే వైఎస్ఆర్‌సిపి పరిస్థితి ఏంటి?

ఎగ్జిట్ పోల్ ఫలితాలు.. తెలంగాణ ఎవరు టాప్.. ఎవరికి ఎన్ని సీట్లు?

పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారు: ఆరా మస్తాన్ exit polls (video)

ఎగ్జిట్ పోల్స్.. ఏపీలో టీడీపీ.. జాతీయ స్థాయిలో ఎన్డీయేకే పట్టం..

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

మామిడి పండ్లు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments