Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య రామాలయంలో ప్రియాంక చోప్రా దంపతులు.. మెరిసిన మాల్తీ

సెల్వి
గురువారం, 21 మార్చి 2024 (18:37 IST)
Priyanka Chopra
నటి ప్రియాంక చోప్రా జోనాస్, ఆమె భర్త, అమెరికన్ గాయకుడు నిక్ జోనాస్ తన పుత్రికతో కలిసి అయోధ్యను సందర్శించుకున్నారు. ప్రియాంక చోప్రా రెండేళ్ల కుమార్తె మాల్తీ మేరీ జోనాస్‌తో కలిసి అయోధ్యలోని రామమందిరంలో పూజలు చేశారు.
 
పసుపు రంగు చీర ధరించిన ప్రియాంక చోప్రా, కుర్తాలో నిక్ జోనాస్, పీచ్ కలర్ గౌనులో మాల్తీలకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రామయ్య దర్శనం, పూజల తర్వాత ఆలయ పూజారుల నుంచి తీర్థప్రసాదాలు అందుకున్నారు. పూజారుల ఆశీస్సులు తీసుకున్నాక వారితో కలిసి ఫొటోలకు ఫోజిచ్చారు.
 
అంతకుముందు రోజు, ఈ స్టార్ జంట తమ కుమార్తెతో అయోధ్య విమానాశ్రయంలో ఫోటోలకు ఫోజులిచ్చారు. 
 
జనవరి 22న జరిగిన మహా సంప్రోక్షణ మహోత్సవం తర్వాత వారు రామమందిరాన్ని ప్రియాంక చోప్రా సందర్శించడం ఇదే తొలిసారి. ఈ వేడుకకు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, అలియా భట్-రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ రిషబ్ శెట్టితో సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఇకపోతే.. ప్రియాంక చోప్రా మంగళవారం ముంబైలో జరిగిన ప్రైమ్ వీడియో ప్రెజెంట్స్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన రాబోయే ప్రాజెక్టు "విమెన్ ఆఫ్ మై బిలియన్" డాక్యుమెంటరీని వివరాలను మీడియాతో షేర్ చేశారు.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments