Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయిన హీరోయిన్‌పై మనసుపడిన ఎస్.ఎస్.రాజమౌళి

Webdunia
ఆదివారం, 2 డిశెంబరు 2018 (12:59 IST)
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి నిర్మిస్తున్న మల్టీస్టారర్ మూవీ 'ట్రిపుల్ ఆర్'. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూర్చుతుండగా, విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభంకాగా, హీరోయిన్లతో ఇతర నటీనటుల ఎంపిక మాత్రం ఇంకా జరగలేదు. 
 
అయితే, మాజీ హీరోయిన్ ప్రియమణి ట్రిబుల్ ఆర్‌లో ఓ ముఖ్యపాత్రలో కనిపించనుందనే ప్రచారం ప్రస్తుతం టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. గతంలో ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన 'యమదొంగ'లో ప్రియమణి హీరోయిన్‌గా నటించింది. అప్పట్లో ఈ సినిమా ప్రియమణికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 
 
ఆ తర్వాత కొంత మంది స్టార్ హీరోలతో ప్రియమణి నటించింది. వివాహం తర్వాత ప్రియమణి నటనకు దూరం కావడంతో మళ్లీ వెండితెరపై కనిపించలేదు. కానీ, ట్రిపుల్ ఆర్ చిత్రం ద్వారా ప్రియమణి మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనుందని అంటున్నారు. ఈ చిత్రంలో పవర్‌ఫుల్ లేడీ విలన్‌గా ప్రియమణి కనిపించనుందనే వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments