Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్పీ పట్నాయక్‌ ఫైర్.. తులసీదళం పాటల్ని సీరియల్‌లో వాడుకుంటారా?

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (17:05 IST)
టాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ ఆర్పీ పట్నాయక్ ఓ సీరియల్ నిర్మాతపై కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తులసీదళం సినిమాకు ఆర్పీ కథ, స్క్రీన్ ప్లే, సంగీతం అందించడమే కాదు దర్శకత్వం కూడా వహించారు. అలాగే నిర్మాతగానూ వ్యవహరించారు.

మొత్తానికి స్వీయదర్శకత్వంలో నిర్మించిన 'తులసీదళం' సినిమా పాటలను అనుమతి లేకుండా 'అత్తో అత్తమ్మ కూతురో' అనే టీవీ సీరియల్‌లో ఉపయోగించారని ఆర్పీ ఫైర్ అయ్యారు. అందుకే ఆ సీరియల్ నిర్మాతపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నామన్నారు. 
 
ఇందులో భాగంగా రూ. రూ.50 లక్షల పరిహారం కోరుతూ దావా వేస్తున్నామని ఆర్పీ పట్నాయక్ తెలిపారు. సీరియళ్లలో సినిమా పాటలు వాడుకోవడం మామూలేనని, కానీ, తమ చిత్రం ఇంకా విడుదల కాలేదని, విడుదల కాని సినిమా పాటలను సీరియల్‌లో ఉపయోగించడం ఎంతవరకు సబబని ఆర్పీ ప్రశ్నించారు. 'అత్తో అత్తమ్మ కూతురో' సీరియల్ జెమినీ టీవీలో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments