Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనా రనౌత్ ఒక్క సినిమాలో నటించి రాణి లక్ష్మీ‌బాయ్‌ని అనుకుంటే ఎలా?

Webdunia
శనివారం, 12 సెప్టెంబరు 2020 (13:03 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన కామెంట్స్‌తో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సుశాంత్ మరణం అనంతరం ఆమె మరింత దూకుడు పెంచారు. సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటుగా పలువురు బాలీవుడు ప్రముఖులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
 
అలాగే మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన ప్రభుత్వంపై ఆమె విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్.. కంగనా కార్యాలయం కూల్చివేయాలని నిర్ణయం తీసుకోవడం తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ నిర్ణయంపై కంగనై బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు స్టే విధించింది.
 
ఇలాంటి పరిస్థితుల్లో కంగనా రనౌత్‌పై నటుడు ప్రకాశ్‌రాజ్ వ్యంగ్యాస్త్రాలు సాధించారు. సోషల్ మీడియాలో #justasking పేరుతో వర్తమాన అంశాలపై తనదైన శైలిలో స్పందించే ప్రకాశ్‌రాజ్... తాజాగా కంగనాపై సెటైర్లు వేశారు. 
 
"ఒక్క సినిమాతో కంగనా.. తనను తాను రాణి లక్ష్మీ బాయి అని అనుకుంటే.. అప్పుడు దీపికా పడుకొనే -పద్మావతి, హృతిక్ రోషన్- అక్బర్, షారుఖ్‌ ఖాన్-అశోక, అజయ్ దేవ్‌గన్- భగత్ సింగ్, అమీర్ ఖాన్-మంగల్ పాండే, వివేక్ ఒబేరాయ్- మోదీ.. వీళ్లు కూడా అలానే ఆలోచించాలా" అంటూ సంబంధిత ఫొటోలను ప్రకాశ్‌రాజ్ ట్విట్టర్‌లో ట్యాగ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments