Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైసూరు మ్యూజియం నుంచి ప్రభాస్ మైనపు విగ్రహం తొలగింపు.. ఎందుకు?

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2023 (09:16 IST)
మైసూరు మ్యూజియంలో టాలీవుడ్ హీరో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని ఉంచారు. దీనికి బాహుబలి విగ్రహం అంటూ నామకరణం చేశారు. ఈ విగ్రహానికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లుకొట్టింది. అయితే, ఈ విగ్రహంలో ప్రభాస్ పోలికలు ఏమాత్రం లేకపోవడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 
 
పైగా, 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డ కూడా మైసూరు మ్యూజియం తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభాస్ విగ్రహాన్ని తయారు చేస్తున్నట్టు, దాన్ని మైసూరు మ్యూజియంలో ఆవిష్కరిస్తున్నట్టు తమకు ఎవరూ సమాచారం ఇవ్వలేదని తెలిపారు. అసలు, ఆ విగ్రహం నిపుణుడు తయారుచేసినట్టుగా లేదని వ్యాఖ్యానించారు. ఆ విగ్రహం తొలగింపునకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు.  
 
దీంతో మైసూరు మ్యూజియం వర్గాలు వివరణ ఇచ్చాయి. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్నది తమ అభిమతం కాదని మ్యూజియం అధికారులు స్పష్టం చేశారు. అయితే, విగ్రహం పట్ల అభ్యంతరాలు వస్తున్నందున, మ్యూజియం నుంచి ఆ విగ్రహాన్ని తొలగిస్తాం అని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రజావాణికి మంచి రెస్పాన్స్.. దరఖాస్తుల వెల్లువ

సినిమా విలన్ సీన్లను తలపించేలా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ శైలి (Video)

పవర్ స్టార్ లిక్కర్ బ్రాండ్.. 999 పవర్ స్టార్ పేరిట సేల్... సంగతేంటి?

హస్తిన వెళుతున్న సీఎం చంద్రబాబు.. 4న ప్రధాని మోడీతో భేటీ!

హథ్రాస్ తొక్కిసలాటలో 122 మందికి చేరుకున్న మృతుల సంఖ్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments