Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిర్చి ఘాటుకు తర్వాత బాహుబలి.. రాధాకృష్ణ సినిమాలో జ్యోతిష్కుడిగా ప్రభాస్..!

మిర్చి ఘాటుకు తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. ఆపై రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న బాహుబలికి సినిమాకు అంకితమైపోయారు. అయితే ''బాహుబలి-2" తర్వాత రెండు సినిమాలు సంతకాలు చేసేశారు. రెండింటిలో ఒకటి "జిల్‌"

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2016 (12:18 IST)
మిర్చి ఘాటుకు తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. ఆపై రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న బాహుబలికి సినిమాకు అంకితమైపోయారు. అయితే ''బాహుబలి-2" తర్వాత రెండు సినిమాలు సంతకాలు చేసేశారు. రెండింటిలో ఒకటి "జిల్‌" చిత్ర దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

రాధాకృష్ణ ప్రస్తుతం ప్రభాస్‌ కోసం ఓ కథని సిద్ధం చేశారు. హస్త సాముద్రికం నేపథ్యంలో సాగే సినిమా అని సమాచారం. ఇందులో చేయి చూసి భవిష్యత్తు చెప్పేస్తుంటాడట రెబెల్ స్టార్‌. దానికి చక్కటి ప్రేమకథ కూడా జోడించారని తెలుస్తోంది. 
 
కథ వినగానే ప్రభాస్‌ ఓకే చేశారని.. యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశాలున్నట్లు సమాచారం. బాహుబలి సినిమా ద్వారా యంగ్ రెబల్‌స్టార్‌కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇక రాధాకృష్ణ సినిమా వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానుంది.

ఈ సినిమా గురించి రాధాకృష్ణ మాట్లాడుతూ -" ప్రేమకథా చిత్రమిది. పూర్తిగా విదేశాల్లోనే చిత్రీకరిస్తాం. ప్రభాస్ పక్కన హీరోయిన్‌గా కొత్త అమ్మాయిని ఎంపిక చేయాలనుకుంటున్నాం" అని తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Delhi: మూడేళ్ల పసికూనపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు

అలస్కా తీరంలో భూకంపం : రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు

అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. ఎందుకో తెలుసా?

హిందూపురం నుంచి ఇద్దరిని సస్పెండ్ చేసిన వైకాపా హైకమాండ్- దీపికకు అది నచ్చలేదు

జైలులో ప్రాణహాని జరిగితే పాక్ సైన్యానిదే బాధ్యత : ఇమ్రాన్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments