Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెదనాన్న మృతి.. అయినా ఫ్యాన్స్ కోసం డార్లింగ్ ఏం చేశాడంటే..? (వీడియో)

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (10:51 IST)
prabhas
రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలు సోమవారం ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో మొయినాబాద్‏లోని కనకమామిడి ఫామ్ హౌస్‏లో రెబల్ స్టార్‏ అంత్యక్రియలు నిర్వహించి నివాళులు అర్పించారు. 
 
కృష్ణంరాజు మృతితో శోకసంద్రంలో మునిగిపోయిన ప్రభాస్.. గుండె నిండా బాధలోనూ అభిమానుల కోసం ఆలోచించారట. తన పెదనాన్న అంత్యక్రియలలో పాల్గోనేందుకు వచ్చినవారంతా తిని వెళ్లాలని భోజనం ఏర్పాట్లు చేయించారట. ఈ విషయాన్ని తెలుసుకుని సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ వీడియోలు షేర్ చేస్తూ ప్రభాస్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
 
తన పెదనాన్న అంత్యక్రియలలో ఫ్యాన్స్‏తో ప్రభాస్ మాట్లాడుతున్న వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందరూ భోజనం చేసి వెళ్లండి అంటూ చెప్పుకొచ్చాడట ప్రభాస్. మనసులో బాధను పెట్టుకుని కూడా అభిమానుల కడుపు నింపాలని ఆలోచించిన ప్రభాస్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 
రాజు ఎక్కడున్నా రాజే.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక డార్లింగ్ తన షూటింగ్ సెట్‏లో అందరికీ సరిపడా భోజనాన్ని ఇంటినుంచే రెడీ చేయించి తీసుకెళ్తుంటాడనే సంగతి తెలిసిందే.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొక్కజొన్న తోటలో దారుణం : వేరొకరితో మాట్లాడుతుందని ప్రియురాలిని చంపేసిన ప్రియుడు...

నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైకాపా అదృష్టం : ఆర్ఆర్ఆర్

తుని రైలు దగ్దం కేసు : ఏపీ సర్కారు కీలక నిర్ణయం

ఉగ్రవాదులతో లింకులు.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల డిస్మిస్

శారీరకంగా వాడుకుని తప్పించుకు తిరుగుతున్నాడు: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments