Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెదనాన్న మృతి.. అయినా ఫ్యాన్స్ కోసం డార్లింగ్ ఏం చేశాడంటే..? (వీడియో)

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (10:51 IST)
prabhas
రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలు సోమవారం ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో మొయినాబాద్‏లోని కనకమామిడి ఫామ్ హౌస్‏లో రెబల్ స్టార్‏ అంత్యక్రియలు నిర్వహించి నివాళులు అర్పించారు. 
 
కృష్ణంరాజు మృతితో శోకసంద్రంలో మునిగిపోయిన ప్రభాస్.. గుండె నిండా బాధలోనూ అభిమానుల కోసం ఆలోచించారట. తన పెదనాన్న అంత్యక్రియలలో పాల్గోనేందుకు వచ్చినవారంతా తిని వెళ్లాలని భోజనం ఏర్పాట్లు చేయించారట. ఈ విషయాన్ని తెలుసుకుని సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ వీడియోలు షేర్ చేస్తూ ప్రభాస్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
 
తన పెదనాన్న అంత్యక్రియలలో ఫ్యాన్స్‏తో ప్రభాస్ మాట్లాడుతున్న వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందరూ భోజనం చేసి వెళ్లండి అంటూ చెప్పుకొచ్చాడట ప్రభాస్. మనసులో బాధను పెట్టుకుని కూడా అభిమానుల కడుపు నింపాలని ఆలోచించిన ప్రభాస్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 
రాజు ఎక్కడున్నా రాజే.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక డార్లింగ్ తన షూటింగ్ సెట్‏లో అందరికీ సరిపడా భోజనాన్ని ఇంటినుంచే రెడీ చేయించి తీసుకెళ్తుంటాడనే సంగతి తెలిసిందే.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

కాబోయే అత్తతో లేచిపోయిన కాబోయే అల్లుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments